Home » అప్పట్లో కమల్ హాసన్ ని పట్టుకొని శోభన్ బాబు ఏడ్చాడట.. కారణం ఏంటంటే..?

అప్పట్లో కమల్ హాసన్ ని పట్టుకొని శోభన్ బాబు ఏడ్చాడట.. కారణం ఏంటంటే..?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో జరిగే విషయాలు చాలా విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయి. ఒక హీరోతో సినిమా తీద్దామని అనుకున్న తరువాత  అకస్మాత్తుగా ఏవేవో కారణాలవల్ల మరొక హీరో చేయాల్సి  వస్తుంది.  రాత్రికి రాత్రి దర్శక, నిర్మాతలు లేదా నటీనటులు సాంకేతిక నిపుణులు వంటి వారు మారిపోతుంటారు. ముఖ్యంగా ఆ రోజుల్లో జరిగిన ఎవరికీ తెలియని సంఘటనల గురించి వచ్చే వార్తల గురించి వినడానికి ఎంతో చాలా ఆసక్తి చూపిస్తుంటారు. నటభూషణ శోభన్ బాబు- కమలహాసన్ మధ్య చోటు చేసుకున్న ఊహించని పరిణామానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. తాను చేయాల్సిన కథతో కమలహాసన్ సినిమా చేసి సంచలన విజయం సాధించడంతో  షాక్ అయ్యారట శోభన్ బాబు.

Advertisement

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజులతో పాటు శోభన్ బాబు కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు శోభన్ బాబు. భూమిని నమ్ముకుంటే నష్టపోమని నమ్మి చాలా ప్రాంతాల్లో స్థలాలు పొలాలు కొన్నారు. ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తితోనే నటుడు మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. అప్పట్లో ఇద్దరు కథానాయకులు కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు శోభన్ బాబు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. డేట్స్ ఖాళీ లేక చాలా సినిమాలను వదులుకున్నారు. ఆయనకు కథలు కూడా ఓ పట్టాను నచ్చేవి కావట. కొన్నింటిని వద్దనుకొని ఆ తర్వాత ఫీల్ అయిన సినిమా ఆకలి రాజ్యం. కమలహాసన్ హీరోగా దర్శక దిగ్గజం కే.బాలచందర్ తెరకెక్కించిన అద్భుత చిత్రం ఆకలి రాజ్యం. తొలుత ఈ సినిమా శోభన్ బాబుతో తీయాలని అనుకున్నారట. అయితే  శోభన్ బాబుకి ముందు నుంచి హీరో పాత్ర విషయంలో కొన్ని సందేహాలు ఉండడంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించాడట.  అందుకు దర్శకుడు ఒప్పుకోలేదట.

Advertisement

జీవితంలో రాజీ పడని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద, నిరుద్యోగ యువకుడిగా కనిపించే హీరో అతనికి ఎదురయ్యే సమస్యలు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇలా అన్నీ బాగానే ఉన్నప్పటికీ..  ఎం.ఏ. ఫిలాసపీ చదివి సెలూన్ లో పని చేయడం అనేది శోభన్ బాబుకు నచ్చలేదట. అతను చేయడానికి ఇంకా పనులు లేవా..? మార్చండి అని చెబితే దానికి ససే ఏమిరా అన్నాడు దర్శకుడు.  పాత్ర మార్పు బదులు ఏకంగా హీరో పాత్రధారుడినే మార్చేశారు. దీంతో శోభన్ బాబు స్థానంలో కమల్ హాసన్ ని తీసుకున్నారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ఊహించిన దాని కంటే ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన పాటలు అయితే మారు మ్రోగిపోయాయి. 100 రోజుల వేడుకకు శోభన్ బాబుని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడానికి స్వయంగా కమలాసమే ఆయన ఇంటికి వెళ్లారట. ఈ సినిమా ఇంత బాగా వస్తుందని తాను అస్సలు ఊహించలేదని.. అద్భుతంగా నటించావు అంటూ కమలహాసన్ ని ఎత్తుకొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారట. అదేవిధంగా ఆకలి రాజ్యం వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని వదులుకున్నందుకు శోభన్ బాబు చాలా బాధపడ్డారట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు ప్రస్తుతం అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో.. అతను ఎవరో తెలుసా ?

 మహేందర్ రెడ్డి తన దారి తను చూసుకున్నారా?

Visitors Are Also Reading