Home » నోబాల్ వివాదం… పాక్ నోరు మూయిస్తున్న భారత్ ఫ్యాన్స్..!

నోబాల్ వివాదం… పాక్ నోరు మూయిస్తున్న భారత్ ఫ్యాన్స్..!

by Azhar
Ad
ఇండియా, పాక్ మ్యాచ్ అంటేనే ఎంతో ఒత్తిడి మధ్య జరిగే మ్యాచ్ అనేది అందరికి తెలిసిందే. ఇక ఇలాంటి మ్యాచ్ లో ఏ చిన్న తప్పు జరిగిన కూడా ఫ్యాన్స్ వదిలిపెట్టారు. కానీ కొన్నిసార్లు ఓడిన కోపంతో.. కరెక్ట్ ను కూడా తప్పులాగా చూపిస్తారు. ఇక నిన్నటి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడంతో.. ఇప్పుడు పాక్ ఫ్యాన్స్ ఆ పనిలోనే ఉన్నారు.
అయితే ఫ్యాన్స్ అంటే ఏది ఎమోషన్ లో అలా చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఎన్నో ఏళ్ళు క్రికెట్ ఆడిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా అలాంటి ఆకేంన్స్ అనేవి చేయడం ఇప్పుడు చర్చిగా మారింది. నిన్నటి మ్యాచ్ ఆఖరి ఓవర్ లోని నో బాల్ పై అక్తర్ స్పందిస్తూ.. అంపైర్ భయ్యా.. ఈరోజు రాత్రి నీకు భోజనం పక్క అంటూ.. నో బాల్ ఫోటోను పోస్ట్ చేసాడు.
ఇక బ్యాటర్ నడుముకంటె పైకి అనేది బాల్ డైరెక్ట్ వస్తే అది నో బాల్ అని చిన్నపిల్లాడి కూడా తెలుసు. అయిన కూడా అది నో బాల్ కాదు అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. కానీ పాక్ ఫ్యాన్స్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఇండియా ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ఆ నో బాల్ ఫోటో పైన పాక్ వారికీ కనిపించేందుకు నడుముకు సక్కగా లైన్ గీస్తూ.. బాల్ ఎత్తులో ఉంది చూస్కోండి అంటూ పోస్ట్లు పెడుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading