Home » ఉక్రెయిన్‌లో మరో భారతీయుడు మృతి

ఉక్రెయిన్‌లో మరో భారతీయుడు మృతి

by Anji
Ad

ఉక్రెయిన్ దేశంలో మ‌రో భార‌తీయుడు మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మ‌రో విద్యార్థి ఉక్రెయిన్ దేశంలో మృతి చెందిన‌ట్టు స‌మాచారం అందుతోంది. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్ అనే వ్యాధి కార‌ణంగా మృతి చెందిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ఈ విష‌యాన్ని కాసేప‌టి క్రిత‌మే భార‌తీయ విదేశాంగ శాఖ ధృవీక‌రించింది.

Advertisement


పంజాబ్ బ‌ర్నాలాకు చెందిన భార‌తీయ విద్యార్థి మృతి చెందిన‌ట్టు భార‌తీయ విదేశాంగ శాఖ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్యార్థి చంద‌న్‌ జిందాల్ (22) ఇస్కీమిక్ స్ట్రోక్‌తో విన్నిట్సియా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ఆసుప‌త్రిలో చేరాడు. అయితే ఆసుప‌త్రికి చేరే ముందే మ‌ర‌ణించాడు. చంద‌న్ జిందాల్ విన్నిట్సియా నేష‌న‌ల్ పైరోగోవ్ మెమోరియ‌ల్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నాడు. అత‌ని మృత‌దేహాన్ని తీసుకురావ‌డానికి ఏర్పాట్లు చేయాల‌ని అత‌ని తండ్రి భార‌త ప్ర‌భుత్వానికి లేఖ రాశారంటూ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

Advertisement

Also Read :  యుద్ధ వాతావ‌ర‌ణంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల‌ను స్వ‌దేశానికి చేర్చి.. తెగువ చూపిన మ‌హిళా ఫైలట్

Visitors Are Also Reading