టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సమ్మర్ లో వివాహం చేసుకున్నాడు. ఇక నెల రోజుల కిందట హీరో శర్వానంద్ కూడా రాజస్థాన్లో ఓ రాజకీయ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటు మెగా హీరో వరుణ్ తేజ్… హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ మాసంలో వీరిద్దరి వివాహం జరగనుందని సమాచారం అందుతుంది.
Advertisement
ఇలాంటి తరుణంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ నగరానికి ఏమైంది సినిమా రీ – రిలీజ్ అయి.. బంపర్ కలెక్షన్లను కూడా రాబట్టింది. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమాలో మెయిన్ హీరోగా నటించినటువంటి.. సాయి సుశాంత్ రెడ్డి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. సాయి సుశాంత్ రెడ్డి.. ఎంగేజ్మేమెంట్ కార్యక్రమం నిన్న చాలా గ్రాండ్ గా జరిగిందట.
Advertisement
దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు సాయి సుశాంత్ రెడ్డి.. దీంతో సాయి సుశాంత్ రెడ్డి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే.. తనకు కాబోయే భార్యకు సంబంధించిన వివరాలను మాత్రం సాయి సుశాంత్ రెడ్డి.. షేర్ చేసుకోలేదు. కేవలం ఎంగేజ్మెంట్ ఫోటోలను మాత్రమే షేర్ చేసాడు సాయి సుశాంత్ రెడ్డి.. అలాగే.. సాయి సుశాంత్ రెడ్డిది.. లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ.. సాయి సుశాంత్ రెడ్డి జంట పెళ్లి చేసుకోబోతుందట.
ఇవి కూడా చదవండి
Samantha : సినిమాలకు సమంత గుడ్ బై….రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసింది !
2011 వన్డే వరల్డ్ కప్లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
ఏపీలో షూటింగ్ ఉచితమే..సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడతా – పోసాని కృష్ణ మురళి