Home » నిహారికకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్న సాయి ధరంతేజ్..మరి ఇలా మారారేంటి..!

నిహారికకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్న సాయి ధరంతేజ్..మరి ఇలా మారారేంటి..!

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిసారి హీరోయిన్ గా మారిన ఏకైక అమ్మాయి నిహారిక. కానీ హీరోయిన్ గా చేసిన సక్సెస్ కాలేక పోయింది. అయితే మరికొన్ని చిత్రాల్లో నటించి నిహారిక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. ఈ టైంలోనే మెగా ఫ్యామిలీ ఆమెకు పెళ్లి చేసేసారు. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

వీరి పెళ్లి జరిగినప్పటి నుండి ఏదో ఒక వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల నిహారిక చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ మరో వార్త అందరినీ షాక్ కి గురిచేసింది. ఇంకోవైపు నిహారిక ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అవకాశాలు అందుకుంటోంది. ఈమె నటించిన డెడ్ ఫిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతుంది.

Advertisement

ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీం హీరో నిహారిక మేన బావ సాయిధరమ్ తేజ్ రాబోతున్నారంటూ న్యూస్ వచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫామ్ చేసేసారు. అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న నిహారికకు మద్దతు పలికి బూస్టర్ ఇవ్వాలని సాయి ధరం తేజ్ భావిస్తున్నారట. అందుకే ఆ ఈవెంట్ కు ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading