Home » ఆ నటుడితో డివోర్స్ పై క్లారిటీ ఇచ్చిన రుక్మిణీ శీతల్..!

ఆ నటుడితో డివోర్స్ పై క్లారిటీ ఇచ్చిన రుక్మిణీ శీతల్..!

by Anji
Ad

న‌టుడు పృథ్వీ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లి,  సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా యానిమ‌ల్ సినిమాతో మరోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. పృథ్వీ రాజ్ త‌న రెండో భార్య రుక్మిణి శీతల్‌కు విడాకులు ఇచ్చిన‌ట్లు  ఇటీవలే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

రుక్మిణీ శీతల్ పృథ్వీరాజ్ కంటే చాలా చిన్నది. వీరి మధ్య దాదాపు 30 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అయితే వీరి మ‌ధ్య మనస్పర్థాలు రావడంతో డివోర్స్ తీసుకున్న‌ట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ డివోర్స్ వార్త‌ల‌పై తాజాగా రుక్మిణీ శీతల్ షాకింగ్ పోస్ట్ పెట్టింది.  “పృథ్వీరాజ్‌తో తాను విడాకులు తీసుకోలేద‌ని పేర్కొంది. తమకు అసలు పెళ్లి కాలేదని.. ఇప్ప‌టివ‌ర‌కు లివ్ ఇన్‌ రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పుకొచ్చింది. అయితే, అనుకోని కారణాల వ‌ల్ల మా రిలేష‌న్‌ కంటిన్యూ చేయలేకపోయామని కాబట్టి, మేమిద్దరం వేర్వేరుగా ముందుకు సాగాల్సి వచ్చిందన్నారు.. అందుకే విడిపోతున్నామని.. మా నిర్ణయాన్ని గౌరవించి దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి” అంటూ పోస్ట్ చేసింది.

Advertisement

 

వాస్తవానికి 1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నాడు నటుడు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ బాబు అహద్ మెహన్ జబ్బర్ అనే కొడుకు కూడా పుట్టాడు. అయితే చాలా కాలంపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య సమస్యలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి 6 సంవత్సరాల పాటు విడివిడిగా జీవించారు. 2022లోనే చట్టబద్ధంగా వివర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న నటుడు పృథ్వీరాజ్.. రుక్మిణి శీతల్ కు దగ్గరయ్యాడు.

Also Read :  రెండో పెళ్లిపై నిహారిక కొణిదల క్లారిటీ.. మాజీ భర్త చైతన్య ఆసక్తికర పోస్ట్..!

Visitors Are Also Reading