Home » పాకిస్థాన్ పర్యటన పై రోహిత్ వెర్షన్ ఇదే..?

పాకిస్థాన్ పర్యటన పై రోహిత్ వెర్షన్ ఇదే..?

by Azhar
Ad
రేపు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనేది జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక గత ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇండియా ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తుంటే.. మళ్ళీ అదే సీన్ ను రిపీట్ చేయాలనీ పాకిస్థాన్ భావిస్తుంది.
ఇక ఈ మ్యాచ్ కోసమే ఆటగాళ్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా చేసిన కామెంట్స్ మొత్తం అట్రాక్షన్ తమ వైపు తిప్పుకున్నాయి. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఇండియా పాల్గొనదు.. ఆ సిరీస్ ను వేరే వేదిక పైనే నిర్వహించాలని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు రెండు దేశాలలో ఈ విషయం పైనే చర్చ అనేది సాగుతుంది.
అయితే తాజాగా ఆసీస్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ కూడా ఈ ప్రశ్న అనేది ఎదురైంది. దానిపైన తన వెర్షన్ అనేది చెప్పిన రోహిత్.. పాకిస్థాన్ కు వెళ్లడం పైన తనకు ఏం తెలియదు అని.. ఆ విషయాలు బీసీసీఐ చూసుకుంటుంది అని తెలిపారు. ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం రేపు పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ పైనే ఉందని.. అందులో ఎలా గెలవాలి అనేది ఆలోచిస్తున్నం అని రోహిత్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading