Home » Rishabh Pant:కర్రలతో రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

Rishabh Pant:కర్రలతో రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

by Bunty
Ad

ఐపీఎల్ 16వ సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు తాజా సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

read also : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

Advertisement

ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇది ఇలా ఉండగా, గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ యాక్సిడెంట్ నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు స్టార్ ప్లేయర్. గాయం కారణంగా పంత్ మెగా టోర్నీలన్నింటికీ దూరం కావాల్సి వచ్చింది.

Advertisement

IPL 2023 DC vs GT : Rishabh Pant watching match from the stands

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 కి కూడా దూరం అయ్యాడీ స్టార్ ప్లేయర్. అయితే మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు రిషబ్ పంత్ హాజరయ్యాడు. షార్ట్, వైట్ టీ షర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా పంత్ కు అభిమానులు హర్షద్వానాలతో స్వాగతం పలికారు. పంత్ రాకను మానిటర్ లో గమనించిన సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్ పాంటింగ్ సహ ఢిల్లీ క్యాపిటల్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

read also : Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?

Visitors Are Also Reading