Home » ఎంతటి వారియైనా బొక్కలేస్తా…సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..

ఎంతటి వారియైనా బొక్కలేస్తా…సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..

by Bunty
Ad

ఎంతటి వారియైనా బొక్కలేస్తానంటూ …అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

గత ప్రభుత్వ హయాంలో అనేక స్కాములు స్కీములు జరిగాయని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి… ఎంతటి వారైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రగతిభవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.. ప్రగతిభవన్‌ ముందు గద్దర్‌ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదని మండిపడ్డారు. మేం వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టామని స్పష్టం చేశారు.

ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం.. మాది ప్రజా ప్రభుత్వం అని వెల్లడించారు. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా? అని నిలదీశారు రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని తెలిపారు. వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసు.. గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు భరించలేకపోతున్నారని ఎద్దేవా చేసారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading