Home » IPL 2022 : ఆర్సీబీ హ్య‌ట్రిక్ విజ‌యం..!

IPL 2022 : ఆర్సీబీ హ్య‌ట్రిక్ విజ‌యం..!

by Anji
Published: Last Updated on
Ad

ముంబయి ఇండియన్స్​పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


అనూజ్ రావత్ (66), విరాట్ కోహ్లీ (48) మెరుగ్గా రాణించారు. డుప్లెసిస్ (16) ఫర్వాలేదనిపించాడు. దీంతో హ్యాట్రిక్​ గెలుపును అందుకున్న బెంగళూరు.. ముంబయికి నాలుగో మ్యాచ్​లోనూ ఓటమిని కట్టబెట్టింది. ముంబయి బౌలర్లలో జయదేవ్​ ఉనద్కత్​, డెవాల్డ్​ బ్రెవిస్​ చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement

Advertisement

=

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ (68* : 37 బంతుల్లో 5×4, 6×6) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (26) ముంబయికి శుభారంభాన్నందించారు. డెవాల్డ్ బ్రెవిస్‌ (8), రమణ్‌ దీప్‌ సింగ్‌ (6) విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (0), కీరన్‌ పొలార్డ్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. జయదేవ్‌ ఉనద్కట్‌ (13*) పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్‌ ఒక వికెట్ తీశాడు

Visitors Are Also Reading