Home » న్యూజిలాండ్ టెస్టు లో అరుదైన దృశ్యం.. ఫోటో వైర‌ల్

న్యూజిలాండ్ టెస్టు లో అరుదైన దృశ్యం.. ఫోటో వైర‌ల్

by Bunty
Ad

ఇటీవ‌ల ఇండియా న్యూజిలాండ్ ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించి రెండు టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ టెస్టు మ్యాచ్ అనంత‌రం మైదానం లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని బీసీసీఐ క్లిక్ అని ఫోటో తీసింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటో టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జడేజా ఉన్నారు.

Advertisement

అలాగే న్యూజిలాండ్ సంచ‌ల‌న ఆట‌గాళ్లు అజిజ్ ప‌టేల్, ర‌చిన్ ర‌వీంద్ర ఉన్నారు. అయితే ఈ నలుగురు ఒక క్ర‌మం లో నిల‌బడ్డారు. ఈ వ‌రుస‌లో మొద‌ట అక్ష‌ర్ అనే జెర్సీతో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నాడు. ఇత‌ని త‌ర్వాత ప‌టేల్ అనే జెర్సీ తో న్యూజిలాండ్ ఆట‌గాడు అజిజ్ ప‌టేల్ ఉన్నాడు. వీరి త‌ర్వాత ర‌వీంద్ర జెర్సీ తో న్యూజిలాండ్ ఆట‌గాడు. ర‌చిన్ ర‌వీంద్ర ఉన్నాడు. అత‌ని ప‌క్క‌న జ‌డేజా జెర్సీ తో ర‌వీంద్ర జ‌డేజా ఉన్నాడు. దీంతో నలుగురు ఆట‌గాళ్లు ఇద్ద‌రి పేర్ల తో ఉన్నారిని అంటు సోష‌ల్ మీడియా లో నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

అలాగే ఈ ఫోటో ను తెగ వైర‌ల్ చేస్తున్నారు. అయితే రెండు వేర్వేరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఇలా క్రీడా స్ఫూర్తి ని ప్ర‌ద‌ర్శిస్తూ ఇలా ఫోటో కు ఫోజ్ ఇవ్వ‌డం ప‌ట్ల ప‌లువురు సీనియ‌ర్ క్రికెట‌ర్లు కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఎంతో వైర‌ల్ అవుతున్న ఈ ఫోటో ను మీరు కూడా ఒక లూక్ వేసేయండి.

Visitors Are Also Reading