Home » పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ‘రంగస్థలం’ మహేష్ ఆసక్తికరవ్యాఖ్యలు..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ‘రంగస్థలం’ మహేష్ ఆసక్తికరవ్యాఖ్యలు..!

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగినా అంత ఒదిగే ఉండాలనేది అతని నైజం. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టికీ తనను తాను నిరూపించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్. జూన్ 16న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధమవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు. ప్రభాస్ అనగానే స్నేహంతో పాటు ఆయన ఇచ్చే ఆతిద్యం గురించి నటీనటులు చెబుతుంటారు.  

Also Read :   జపాన్లో “ఆరెంజ్” రీ రిలీజ్… అక్కడ రామ్ చరణ్ కు మామూలు క్రేజీ లేదుగా..!

Advertisement

ముఖ్యంగా ఉప్పలపాటి కుటుంబం అంటేనే తిండి పెట్టి తిన్నదాక వదలరని పేర్కొంటుంటారు. ఇప్పటికే ప్రముఖ స్టార్ నటీనటులు అందరూ ఈ విషయాన్ని వెల్లడించారు.  తాజాగా జబర్దస్త్, రంగస్థలం నటుడు ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.సెట్ లో ఎంత మంది ఉన్నా అందరికీ తన ఇంటి నుంచే భోజనం తెప్పిస్తుంటాడు ప్రభాస్. కేవలం సినిమాలోని మెయిన్ టీమ్ కి మాత్రమే కాకుండా సెట్ లో ఎంత మంది ఉంటే అంతమందికి స్పెషల్ ఫుడ్ తీసుకొస్తారు ప్రభాస్. షూటింగ్ లో 200 మంది ఉంటే.. 200 మందికి ప్రభాస్ తరుపున నుంచి ఫుడ్ వస్తుంది. ఒకనొక సందర్భంగా నాకు  ఏ ఫుడ్ నచ్చిందో అని అడిగారు ఒకరోజు. మటన్ అని చెప్పాను. ఆ తరువాత రోజు నాకు మళ్లీ మటన్ తెచ్చాడు ప్రభాస్. ఆయనే ఇంట్లో వండించి మరీ పంపించారు.  అందరూ ప్రభాస్ గురించి చెబుతుంటే నేను విన్నాను.. కానీ ఆ రోజు చూశాను. ప్రభాస్ తో వర్క్ చేస్తుంటే.. చాలా రోజులుంటే బాగుంటుంది అనిపిస్తుంది. 

Advertisement

జీవితాంతం ఆయనతో షూటింగ్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు మహేష్. తాను నటించిన రంగస్థలం మూవీని చూసి ప్రభాస్ తనను మెచ్చుకున్నారని తెలిపారు. రంగస్థలంలో బాగా చేశావ్ అని ప్రభాస్ మెచ్చుకుంటూ హగ్ చేసుకునే సరికి అస్సలు నమ్మబుద్ధికాలేదు. సింప్లిసిటీగా అందరి ముందు చెప్పారు. ఐదేళ్ల తరువాత కూడా గుర్తు పెట్టుకొని అభినందించడం చాలా సంతోషం వేసిందన్నారు. మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న రాజాడీలక్స్ గురించి చెప్పడంతో ప్రజలు ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. రోజుల తరువాత చెక్ షర్ట్స్ వేసుకొని మంచి కామెడీ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ గురించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. 

Also Read :  “ఓజి” మూవీ డైరెక్టర్ సుజిత్ భార్యను చూశారా..? అందంలో హీరోయిన్లు కూడా సరిపోరు..!

Visitors Are Also Reading