Home » MS Dhoni : చరణ్-ధోని కాంబోలో పాన్‌ ఇండియా మూవీ !

MS Dhoni : చరణ్-ధోని కాంబోలో పాన్‌ ఇండియా మూవీ !

by Bunty
Ad

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక రామ్ చరణ్ ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షను చేపడతాడు. అయ్యప్ప స్వామికి రామ్ చరణ్ పెద్ద భక్తుడు. ఈ సంవత్సరం కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాలను వేసుకున్నాడు. ఈ దీక్షను ముంబైలోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూర్తి చేశారు.

Ram Charan Meets MS Dhoni

Ram Charan Meets MS Dhoni

ఇక పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం రామ్ చరణ్ టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనినీ కలిశాడు. వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో ధోని చాలా స్టైలిష్ లుక్ లో చాలా కొత్తగా కనిపించాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నేషనల్ మీడియా ఛానళ్లలో కూడా వైరల్ గా మారాయి. ఇక వీరిద్దరూ కలవడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Advertisement

వీరిద్దరూ సినిమా కోసమే కలుసుకున్నారని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వీరిద్దరూ కలిసింది సినిమా కోసం కాదని, ఓ యాడ్ షూటింగ్ కోసం అని తెలుస్తోంది. గతంలో ఓసారి కూడా చరణ్ ధోని కలిసి యాడ్ చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ మరో యాడ్ లో కలిసి నటించబోతున్నారట. వీరి కాంబోలో సినిమా వస్తే కనుక పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading