Home » ప్రాణ స్నేహితుడు చనిపోయినా చూడటానికి వెళ్ళని రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

ప్రాణ స్నేహితుడు చనిపోయినా చూడటానికి వెళ్ళని రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. వయసు పెరుగుతున్న కొద్ది యువహీరోలతో పోటీ పడుతూ సినిమాలు తీస్తూ పోతున్నారు. సినిమాలో ఫ్లాప్ అవుతున్నా సరే తగ్గడం లేదని చెప్పవచ్చు. ఆమధ్య కాస్త ఇబ్బంది పడినట్లు కనపడిన మళ్ళీ స్పీడ్ పెంచేసి సినిమాలను చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతమైన రెండు సినిమాలకు కూడా సంతకం చేసి ఉన్నారు. అయితే రజినీకాంత్ తన క్లోజ్ ఫ్రెండ్ జయశంకర్ చనిపోతే చివరి చూపు చూడడానికి కూడా వెళ్లలేదట.

Advertisement

మరి ఆయన ఎందుకు వెళ్లలేదు ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వకమందే జయశంకర్ చాలా సినిమాల్లో నటించారు. అంతే కాదు ఈయనను తమిళ్ ఇండస్ట్రీ తమిళనాడు జేమ్స్ బాండ్ అని పిలుచుకునేవారట. రజనీకాంత్ హీరోగా చేస్తే చాలా సినిమాల్లో జయశంకర్ విలన్ గా ఉండేవారు. ఇలా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే రజనీకాంత్ ప్రాణ స్నేహితుడైన జయశంకర్ చనిపోయాడని ఆయనకు తెలిసాక కూడా ఆయన చివరి చూపు చూడడానికి రజినీకాంత్ వెళ్లలేదు.

Advertisement

కానీ, జయశంకర్ చనిపోయాడా అని తెలియగానే రజనీకాంత్, జయశంకర్ కొడుకుకు ఫోన్ చేసి, ఎప్పుడూ నేను మీ ఇంటికి వచ్చిన, మీ నాన్నగారు నన్ను నవ్వుతూ పలకరించే వారు. కానీ ఇప్పుడు ప్రాణం లేనివాడిని చూసి తట్టుకునే శక్తి నాకులేదు. అందుకే నేను వాడిని చివరి చూపు చూడ్డానికి రావడం లేదు. నేను రానందుకు తప్పుగా భావించవద్దు అని రజనీకాంత్ ఆయన కొడుక్కి ఫోన్ చేసి చెప్పారట. ఇక ఈ విషయాన్ని జయశంకర్ కొడుకు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు.

READ ALSO : ఆ కారణాలవల్లే… తారకరత్న పెద్ద స్టార్ కాలేకపోయారా?

Visitors Are Also Reading