Home » నాపై చాలా కుట్రలు చేసారు.. పవన్ పగ తిరుచుకున్నాడు..!

నాపై చాలా కుట్రలు చేసారు.. పవన్ పగ తిరుచుకున్నాడు..!

by Azhar
Ad

మన టాలీవుడ్ లో అంకుశం, ఆహుతి వంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఒకప్పుడు తెలుగు లోని టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన రాజశేఖర్ ఆ తర్వాత వచ్చిన ఫాప్స్ కారణంగా కొంచెం వెనక్కి తగ్గారు. కానీ మళ్లీ 2017లో విడుదలైన గరుడవేగ సినిమాతో ట్రాక్లోకి వచ్చారు రాజశేఖర్. ఆ తర్వాత కల్కి అనే సినిమాతో మరో హిట్ అందుకొని.. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. కానీ ఆయనకు కరోనా అటాక్ చెయ్యడం వల్ల మళ్ళీ నెమ్మదించారు.

Advertisement

ఇక ప్రస్తుతం రాజశేఖర్ ”శేఖర్” అనే సినిమా టైటిల్ తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మలయాళం జోసెఫ్ సినిమాకు రీమేక్ గా విడుదలైంది. అయితే ఈ శేఖర్ సినిమాకు రాజశేఖర్ గారి భార్య జీవిత దర్శకత్వం వహించగా ఇందులో ఆయన కూతురు శివాని కూడా నటించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ చేసిన రాజశేఖర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన పై చాలా కూరలు జరిగాయి అని అన్నారు.

Advertisement

ఈ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… నేను వారి కంటే ఎక్కువ ఎదుగుతున్నాను అనే ఈర్షతో కొంతమంది నా పై కుట్ర చేసి ఉండొచ్చు అని అన్నారు. నా దగ్గరికి హీరోయిన్స్ రాకుండా… దర్శకులు రాకుండా… మంచి మంచి కథలు రాకుండా వారు ఆపే ప్రయత్నాలు చేసి ఉండవచ్చు అని కామెంట్స్ చేశారు. ఇక అలాగే గబ్బర్ సింగ్ సినిమాలోని… అంత్యాక్షరి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనను ఇమిటేట్ చేయడం గురించి మాట్లాడుతూ…. నేను ప్రజారాజ్యం పార్టీ సమయంలో చేసిన వ్యాఖ్యలకు ఈ సినిమాలో పవన్ నాపై పగ తీర్చుకున్నాడు అని అన్నారు. అయితే శేఖర్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోగా… ఆ మరుసటి రోజే ఈ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని సివిల్ కోర్ట్ ఆర్డర్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ధావన్ ను ఇంకా ఏం చేయమంటారు చెప్పండి…?

రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం అవసరే లేదు.. ఆతను ఏం ఆడాడు..!

Visitors Are Also Reading