Home » ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

by Azhar
Ad

గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను తాజాగా పూర్తి చేసుకుంది టీం ఇండియా. అయితే గత ఏడాది వాయిదా పడిన సమయంలో భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. అందువల్ల ఇప్పుడు జరిగిన టెస్ట్ మ్యాచ్ ను కనీసం డ్రా చేసుకున్న కూడా భారత జట్టు ఈ సిరీస్ అనేది కైవసం చేసుకునేది. కానీ ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడం వల్ల సిరీస్ అనేది ఇండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్ లో తడబడిన భారత జట్టు గెలిచి మ్యాచ్ ను కోల్పోవడంతో ఈ సిరీస్ అనేది 2-2 తో సమం అయ్యింది.

Advertisement

ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీం ఇండియా హెడ్ కోచ్ ద్రావిడ్ జట్టు ఓటమికి కారణాలను వివరించాడు. ద్రావిడ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఆ జట్టు బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇందరు బాగా రాణించారు. మంచి భాగసౌమ్యం అనేది నెలకొల్పారు. అయితే మేము ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మొదటి మూడు రోజులు బాగా ఆడాం. ఆధిపత్యం అనేది చెలాయించాం. కానీ ఆ తర్వాత మాల్లో గెలవాలి అనే కసి తగ్గిపోయింది. ఇక అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు పుంజుకొని.. గట్టిగ పోరాడింది అని ద్రావిడ్ అన్నాడు.

Advertisement

అలాగే మేము బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో విఫలమయం. ఇక ఈ ఓటమి అనేది మమల్ని తప్పకుండ నిరాశకు గురి చేస్తుంది. అయితే గతంలో ఎప్పుడు ప్రత్యర్థి జట్టును ఆల్ ఔట్ చేసి విజయాన్ని సొంతం చేసుకునే టీం ఇండియా ఈ మధ్య కాలంలో అలా చేయలేకపోతోంది. అందుకు కారణాలు అయితే తెలియవు. కానీ ఈ మ్యాచ్ లో మేము కొన్ని అవకాశాలను వదిలిపెట్టం. అలాగే నాల్గవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వైఫల్యం అనేది కనిపించింది. ఈ ఏడాది ఆరంభంలో సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు కూడా ఇదే తరహాలో మేము ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది గమనించి.. దానిని సరిదిద్దుకోవాలని ద్రావిడ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!

శ్రేయాస్ ను వెన్నుపోటు పొడిచిన మెకల్లమ్..!

Visitors Are Also Reading