సఫారి గడ్డపై తొలిసారి మొదటి టెస్ట్ సిరిస్ విజయం సాధించి చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా ప్రస్తుతం కోహ్లీ సేన అద్భుతంగా రాణిస్తున్నది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య కవ్వింపులు కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. సాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో కవ్వింపులు పాల్పడుతూ ఆటగాళ్ల దృష్టిని మరల్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు.
చాలా సందర్భాలలో కవ్వింపులకు పాల్పడిన సందర్భాలున్నాయి. సఫారీ గడ్డ మీద జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆటగాళ్ల మధ్య విగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉండడం గమనార్హం. సౌత్ ఆఫ్రికా ఆటగాడు డసేన్, భారత తాత్కాలిక కెప్టెన్ కె.ఎల్. రాహుల్ వికెట్ కోల్పోయిన తీరుపై పెద్ద రాద్ధాంతం చోటు చేసుకుంది. మూడవ రోజు ఆటలో ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దక్షిణాఫ్రికా బౌలర్లు మార్క్ జాన్సన్ మధ్య మాటల యుద్దం కూడా జరిగింది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేవిధంగా ఇటీవల భారత వికెట్ కీపర్ రిషబ్పంత్ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఎల్గర్ కు కవ్వింపులకు పాల్పడిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దక్షిణాఫ్రికాపై రెండవ ఇన్నింగ్లో 28వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతికి సఫారీ బ్యాట్స్మెన్ కిగన్ పీటర్సన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో అశ్విన్తో పాటు రిషబ్పంత్ బిగ్గరగా అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. డీఆర్ఎస్కు వెళ్లాలా వద్దా అనే దానిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ తర్జనభర్జన పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.