Home » ఛార్మి రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్ కి ఎగ్గొట్టాలని చూసింది.. జయసుధ న్యాయం చేసింది..!

ఛార్మి రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్ కి ఎగ్గొట్టాలని చూసింది.. జయసుధ న్యాయం చేసింది..!

by Anji
Ad

టాలీవుడ్ నిర్మాత యలమంచి రవి చంద్ అనగానే ఆయన చేసిన సినిమాల కంటే కూడా వివాదాలు ఎక్కువగా గుర్తుంటాయి. దాసరి నారాయణరావు కి వ్యతిరేకంగా మాట్లాడి ఒకసారి అలాగే సినీ పైరసి మీద పోరాడి నిరహార దీక్ష చేశాడు. ఈయన మాయగాడు అనే సినిమా సమయంలో హీరోయిన్ ఛార్మీతో గొడవపడ్డారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యలమంచి రవి చంద్ నిర్మాతగా వేణు తొట్టెంపూడి హీరోగా ఛార్మి హీరోయిన్ గా వచ్చిన మూవీ మాయగాడు. 

Advertisement

ఈ చిత్రానికి దిలీప్ పొలాన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా పూర్తి అయిన తరువాత ప్రమోషన్స్ సమయంలో చార్మి హాజరు కాకుండా ఇబ్బందిపెట్టిందట. ఆ సమయంలో ఆమెతో గొడవ జరగడంతో ఫిలింఛాంబర్ వరకు పంచాయితీ నడిచింది. మురళీ మోహన్ గారు పిలిచి చర్చించి మాట్లాడారని ఆమెకు రెమ్యూనరేషన్ కూడా మొత్తం ఇచ్చినా ఇలా చేయడంతో వాళ్లు సర్దిచెప్పి పంపారు. చివరికీ ప్రమోషన్స్ కి ఛార్మి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. 

Advertisement

మరోవైపు పైరసీ మీద నిరహార దీక్షకు కూర్చున్న రోజు నేనొక్కడినే కానీ మరుసటి రోజుకు ఒక్కొక్కరిగా సినీ ఇండస్ట్రీ వారందరూ వచ్చారు. ఇండస్ట్రీ  మొత్తం నాకు మద్దతు తెలిపింది. చివరికీ ప్రభుత్వం పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఒప్పుకుంది. ఆ సమయంలో స్థానికంగా సీనియర్ నటి జయసుధ సికింద్రాబాద్ కి ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆవిడ చొరవ చూపి ప్రభుత్వం చర్యలు తీసుకునేవిధంగా సహాయం చేశారంటూ చెప్పారు. ప్రస్తుతం యలమంచి రవిచంద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Visitors Are Also Reading