Home » నేను మహేష్, ప్రభాస్ లతో సినిమా చేయను అంటున్న స్టార్ ప్రొడ్యూసర్..!

నేను మహేష్, ప్రభాస్ లతో సినిమా చేయను అంటున్న స్టార్ ప్రొడ్యూసర్..!

by Azhar
Ad
ప్రస్తుతం మాన తెలుగు నెంబర్ వన్ హీరో ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ స్థానం కోసం చాలా మంది హీరోలు పోటీ లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న ప్రభాస్ ఇందులో ఒక్కరు కాగా వచ్చిన పాన్ ఇండియా అవకాశాలను వదిలేసి తెలుగులోనే సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్న మహేష్ బాబు కూడా ఇందులో ఉండేవాడే. అయితే ఈ ఇద్దరు హీరోల డేట్స్ ఎప్పుడు దొరుకుతయా.. వీరితో ఎప్పుడు సినిమా చేద్దామా అని చిన్న నుండి పెద్ద వరకు చాలా మంది ప్రొడ్యూసర్లు వేచి చూస్తూ ఉంటారు.
కానీ ఓ ప్రొడ్యూసర్ మాత్రం నేను ప్రభాస్, మహేష్ తోనే కాదు ఏ స్టార్ హీరో డేట్స్ దొరికిన కూడా నేను సినిమా చేయను అని కామెంట్స్ చేస్తున్నాడు. అతనే సుమంత్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ ఏంఎస్ రాజు. వర్షం, నువస్తానంటే నేను వద్దంటానా, మనసంతా నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు నిర్మాత రాజు. అయితే ఆయన నుండి తగ వస్తున్న సినిమా 7 డేస్ 6 నైట్స్. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఇందులో రాజు మాట్లాడుతూ.. నేను హీరోను కాకుండా కథను నమ్ముకొనే సినిమా తీస్తాను. ఎందుకంటే హీరోలను నమ్మి సినిమా తీస్తే ఇప్పుడు ప్రజలు చూడటం లేదు. వారు కథ బాగుంటేనే సినిమా చూస్తున్నారు. అందుకే నాకు ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్ ల డేట్స్ దొరికిన కూడా నేను వారితో సినిమా తీయను. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నాకు నచ్చిన సినిమా తీస్తాను. నేను అలా తీసిన మనసంతా నువ్వే సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాను. మంచి లాభాలు కూడా వచ్చాయి అని రాహు తెలిపాడు.

Advertisement

Visitors Are Also Reading