Home » మళ్ళీ నోరు జారిన రమీజ్ రాజా… ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

మళ్ళీ నోరు జారిన రమీజ్ రాజా… ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

by Azhar
Ad

ఇండియా vs పాకిస్థాన్ అంటేనే ఎక్కడ లేని హైప్ అనేది ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రెండు దేశాలలోని అభిమానులలో మాత్రం అది ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ మన భారత ఆటగాళ్లు లేదా బీసీసీఐ అధికారులు ఎక్కువు కూడా ఈ పాకిస్థాన్ గురించి మాట్లాడారు. ఎందుకంటే… పాకిస్థాన్ అనేది మన కంటే చిన్నది వారికి తెలుసు. కానీ ఈ పాకిస్థాన్ మాత్రం ఎప్పుడు మన గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అక్కడి మాజీ ఆటగాళ్లు గాని.. పాకిస్థాన్ బోర్డులోని అధికారులు గాని.. ఎప్పుడు ఇండియాను తక్కువ చేయాలనీ ప్రయత్నిస్తూ ఉంటారు.

Advertisement

అయితే ఇప్పుడు కూడా అలాంటి క్రమంలోనే మళ్ళీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మైన్ రంజీ రాజా ఇండియా విషయంలో నోరు జారాడు. దాంతో మన భారత అభిమానులు అతడిని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పాకిస్థాన్ జట్టు అనేది శ్రీలంక పర్యాటనలో ఉంది. అక్కడ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ చివరి రోజు విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ గెలవడంలో కెప్టెన్ బాబర్ ఆజాం కీలక పాత్ర పోషించాడు. ఇక తమ పాకిస్థాన్ సాధించిన ఈ విజయాన్ని మన ఇండియాతో పోల్చి మాట్లాడాడు రమీజ్ రాజా.

Advertisement

పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు సాధించిన టెస్ట్ విజయాలలో ఇది అద్భుతం. భారీ టార్గెట్ ను బ్యాటర్లు అద్భుతంగా చేధించారు. అక్కడ పరిస్థితులు కఠినంగా ఉన్న విజయం అందుకున్నారు. అయితే ఈ విజయం.. మేము బెంగళూరు వేదికగా భారత్‌పై సాధించిన విజయంతో సమానం’అని చెప్పాడు. అయితే అసలు ఇక్కడ మన ఇండియా గురించి మాట్లాడిన అవసరం లేనే లేదు. అయిన కూడా రమీజ్ రాజా మాట్లాడటంతో.. నీకు ఇండియా గురించి గాని… ఐపీఎల్ గురించి గాని మాట్లాడకుంటే నిద్ర పట్టదా.. మా గురించి కాకుండా మీ గురించి ఆలోచించినప్పుడే మీరు బాగుపడతారు అని కామెంట్స్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

నా లక్ష్యం అదే… క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..!

బీసీసీఐని ఒలంపిక్స్ విషయంలో ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

Visitors Are Also Reading