Home » జ‌ల్సా సినిమా హీరోయిన్ పార్వ‌తీ మెల్ట‌న్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

జ‌ల్సా సినిమా హీరోయిన్ పార్వ‌తీ మెల్ట‌న్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

పార్వ‌తీ మెల్ట‌న్ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. స్టార్ హీరోల సినిమాల‌ల్లో పార్వ‌తి మెల్ట‌న్ హీరోయిన్ గా న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. త‌న అందం అభిన‌యంతో కుర్రాళ్ల మ‌త‌లుపొగొట్టింది ఈ బ్యూటీ. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన జ‌ల్సా సినిమాలో ఇలియానా కంటే అందంగా క‌నిపించి అంద‌రి కండ్ల ను త‌న‌వైపు తిప్పుకుంది. అంతే కాకుండా రాజా హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం వెన్నెల తో పార్వతి మెల్ట‌న్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది.

ALSO READ : భ‌ర్త బాట‌లోనే నిహారిక…ఆ ఒక్క‌టి తప్ప అన్ని ఫోటోలు డిలీట్..!

Advertisement

ఈ చిత్రంలో ప‌ద్ద‌తిగా చీర‌క‌ట్టులో ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ అభిమానుల‌ను సంపాదించుకుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళంలో కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఇక అవ‌కాశాలు త‌గ్గిన త‌ర‌వాత దూకుడు సినిమాలో ఐట‌మ్ సాంగ్ లో కూడా ఈ బ్యూటీ స్టెప్పులు వేసింది. ఈ పాట అప్ప‌ట్లో యూట్యూబ్ ను షేక్ చేసింది.

Advertisement

అయితే స‌డెన్ గా పార్వ‌తి మెల్డ‌న్ సినిమాల‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆమె అభిమానులు ప్ర‌స్తుతం ఎలా ఉంది ఏం చేస్తుంది అని తెలుసుకునేందుకు ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు. కాగా పార్వ‌తి మెల్ట‌న్ 2013 లోనే శంసు లాలానీ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది.

ఆ త‌ర‌వాత భ‌ర్త‌తో క‌లిసి అమెరికాకు వెళ్లిపోయింది. అలా వెళ్లిన పార్వ‌తి మెల్ట‌న్ మ‌ళ్లీ సినిమా జోలీకి వెళ్ల‌లేదు. కాగా గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పార్వ‌తి మెల్ట‌న్ మాట్లాడుతూ త‌న‌ను ఇద్ద‌రు తెలుగు ద‌ర్శ‌కుడు మోసం చేయ‌డం వ‌ల్ల‌నే కెరీర్ నాశ‌నం అయ్యింద‌ని చెప్పింది. అయితే ఆ ఇద్ద‌రు తెలుగు ద‌ర్శ‌కులు ఎవ‌రు అన్న సంగ‌తి మాత్రం బ్యూటీ బ‌య‌ట‌పెట్ట‌లేదు.

ALSO READ : దర్శకుడు రాఘవేంద్రరావుపై పోసాని సెన్షేషనల్ కామెంట్స్ !

Visitors Are Also Reading