Home » “ప‌రుగు” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

“ప‌రుగు” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

కొంత‌మంది హీరోయిన్ లు త‌క్కువ సినిమాలు చేసినా కూడా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి హీరోయిన్ ల లిస్ట్ లో ప‌రుగు సినిమా హీరోయిన్ షీలా కౌర్ కూడా ఒక‌రు. ప‌రుగు సినిమాలో అమాయ‌కంగా క‌నిపిస్తూ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. నిజానికి షీలా కౌర్ చిన్న‌వ‌య‌సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించింది. ఆ త‌ర‌వాత టాలీవుడ్ లో న‌వ‌దీప్ హీరోగా నటించిన సీతాకోక‌చిలుక సినిమా ద్వారా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా త‌ర‌వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ప‌రుగు సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది.

 

Advertisement

అంతే కాకుండా మ‌స్త్ అదుర్స్ సినిమాల్లోనూ హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ హీరోయిన్ గా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. కానీ ఆ త‌ర‌వాత 2011లో సినిమాల‌కు దూర‌మైంది. అప్ప‌టి నుండి మ‌ళ్లీ కోలీవుడ్ లో టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. కాగా రెండేళ్ల క్రితం షీలా కౌర్ తిరుమ‌ల‌లో సంద‌డి చేసింది. దాంతో మీడియా ఆమెను ప‌లు ప్ర‌శ్న‌లు వేసింది.

Advertisement

చూడ్డానికి షీలా కౌర్ చాలా స‌న్న‌బ‌డింది. ఎందుకు ఇలా స‌న్న‌బ‌డ్డారు అని మీడియా ప్ర‌శ్నించ‌గా త‌మిళ్ లో ఓ సినిమా చేస్తున్నాను ఆ సినిమా కోసం అంటూ ఆన్స‌ర్ ఇచ్చింది. తెలుగులోనూ త్వ‌ర‌లో సినిమాలు చేస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండ‌గా షీలా కౌర్ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డార‌ని అందుకే సడెన్ గా సినిమాల‌కు దూర‌మ‌య్యార‌ని వార్త‌లు వినిపించాయి. అంతే కాకుండా గతంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన షీలా ఫోటో కూడా ఒక‌టి ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపించింది.

కానీ ఆ త‌ర‌వాత క‌న్న‌డ‌లో ఓ సినిమా చేయ‌డంతో ఆ వార్త‌ల‌కు చెక్ ప‌డింది. మ‌రోవైపు హీరోయిన్ క్యాన్స‌ర్ నుండి కోలుకుందని కూడా వార్త‌లు వినిపించాయి. మొత్తానికి షీలా మాత్రం ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉంది. అంతే కాకుండా సంతోష్ రెడ్డి అనే కేర‌ళ‌కు చెందిన వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకుని జీవితాన్ని సాగిస్తోంది.

Visitors Are Also Reading