Home » చిరుకి పద్మవిభూషణ్.. స్పందించని ఆ స్టార్ హీరోలు..!

చిరుకి పద్మవిభూషణ్.. స్పందించని ఆ స్టార్ హీరోలు..!

by Anji

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ కి చెందిన పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. ఇక కుర్ర హీరోలు సైతం చిరంజీవి ఇంటివద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చిరంజీవికి సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా విషెస్ చెప్పారు. బాలకృష్ణ మాత్రం ఏ సోషల్ మీడియా వేదికపైనా స్పందించినట్టు కనిపించడం లేదు. 

chiru-and-mahesh

 

బాలయ్యతో పాటు పక్కా భాషల నుంచి కూడా స్పందన కరువైంది. చిరంజీవి అంటే ఎంతో ప్రేమ అని చెప్పుకునే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారి నుంచి కూడా విషెస్ రాలేదు. రాధిక, కుష్బూ వంటి వారు సోషల్ మీడియాలో స్పందించి విషెస్ చెప్పారు. చివరకీ ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమితాబ్ కూడా స్పందించలేదు. మోహన్ లాల్ సైతం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. వారికి సంబంధించి పుట్టిన రోజులు, ఏదైనా ఇతర సందర్భాల్లో చిటుక్కున చిరంజీవి స్పందిస్తారని.. కానీ చిరుకు గొప్ప పురష్కారం లభించినా ఒక్కరూ కూడా స్పందించలేదు ఏంటని అనుకుంటున్నారు.

కొంత మంది మాత్రం.. కేవలం ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియాలోనే విషెస్ చేయాలా..? పర్సనర్ మెసెజ్ చేసి ఉండొచ్చు కదా.. కాల్ చేసి మాట్లాడొచ్చు కదా అని అనుకుంటున్నారు. ఇక మమ్ముట్టి మాత్రం ట్విట్టర్ వేదికగా చిరంజీవికి అభినందనలు తెలియజేయడం విశేషం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading