Home » టీవీ ఇండ‌స్ట్రీలో విషాదం.. టీవీ న‌టి మృతి..!

టీవీ ఇండ‌స్ట్రీలో విషాదం.. టీవీ న‌టి మృతి..!

by Anji
Ad

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్ర‌ముక టీవీ న‌టి రాజేశ్వ‌రి రే మ‌హాపాత్ర క్యాన్య‌ర్ వ్యాధి కార‌ణంగా క‌న్నుమూశారు. భువ‌నేశ్వ‌ర్ లోని కాన్ఫిడెన్సియ‌ల్ ఎమర్జెన్సీ క‌మ్యూనిటీ హాల్లో చికిత్స పొందుతూ ఆమె గురువారం మ‌ర‌ణించింది. 2019 ఏప్రిల్ నెల‌లో మెద‌డు, ఊపిరితిత్తుల‌కు సంబంధించిన క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతోంది.


ఇక రాజేశ్వ‌రి స్వాభిమాన్ ఉన్సి క‌న్య వంటి ఒడియా టీవీ షో సిరీస్‌ల‌లో న‌టించింది. నెగిటివ్ రోల్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. స‌త్య‌మేవ జ‌య‌తే, హే సాథీ వంటి చిత్రాల్లో న‌టించింది. కొంత కాలంగా మెద‌డు, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఆమె భువ‌నేశ్వ‌ర్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ జులై 21న తుదిశ్వాస విడిచారు. ఆమె మ‌ర‌ణ‌వార్త‌తో ఒడియా సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది.

Advertisement

Advertisement

ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు టీవీ, సినీ న‌టీన‌టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం వ్య‌క్తం చేశారు. తాను క్యాన్స‌ర్ తో పోరాడుతున్నా అంటూ 2019లోనే రాజేశ్వ‌రీ రే ఫేస్ బుక్ లో ఎమోష‌నల్ పోస్ట్ షేర్ చేశారు. దీంతో తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తూ ఆమె అభిమానులు ప్రార్థ‌న‌లు చేశారు. ముఖ్యంగా స్వాభిమానం అనే ఒడియా సీరియ‌ల్ తో మ‌హాపాత్ర మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు.

Also Read : 

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘ‌న విజ‌యం.. తొలి ఆదివాసీ మ‌హిళగా రికార్డు..!

 

Visitors Are Also Reading