Home » బాలయ్య డైరెక్షన్ చేద్దాం అనుకున్న ఆ చిత్రాలను ఎన్టీఆర్ చేశారట.. కారణం తెలిస్తే..!!

బాలయ్య డైరెక్షన్ చేద్దాం అనుకున్న ఆ చిత్రాలను ఎన్టీఆర్ చేశారట.. కారణం తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించారు బాలయ్య. ఈయన సినిమాలు అంటేనే కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగులు తప్పనిసరిగా ఉంటాయి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే బాలకృష్ణ అంటే ఎంతోమందికి ఇష్టం. బాలకృష్ణలో కేవలం నటుడే కాకుండా సింగర్ కూడా ఉన్నాడు. పైసా వసూల్ సినిమాలో బాలయ్య పాడిన పాట ఎంత హైలైట్ అయిందో మనందరికీ తెలుసు. అంతేకాదు ఆయనలో ఒక దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. గతంలో ఆయన రెండు పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.

also read:“ఆరెంజ్” సినిమా హీరోయిన్ రూబ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

Advertisement

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

Advertisement

కానీ ఆ చాన్స్ మధ్యలోనే చేజారిపోయింది. బాలయ్య తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సామ్రాట్ అశోక. ఈ సినిమాకు బాలయ్య దర్శకుడు అన్న ప్రకటన వచ్చిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. అయితే సినిమాకు బుద్ధం అశోక అనే టైటిల్ పెట్టారు. ఇందులో గౌతమ బుద్ధుడు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారనీ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత టైటిల్ సామ్రాట్ అశోకగా మారిపోయింది. రామకృష్ణ స్టూడియోలో సినిమా మొదలైంది. చాణిక్యుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ పై బాలయ్య ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల బాలయ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ సామ్రాట్ అశోక సినిమాలో నటిస్తూ ఆయన దర్శకత్వం వహించుకున్నారు. ఇక బాలయ్య రెండో సినిమా నర్తనశాల. ఇందులో ఆయన అర్జునుడి పాత్రలో నటిస్తూ దర్శకుడిగా మారాడు. ద్రౌపదిగా సౌందర్య ప్రముఖ నటులు ఇందులో ఉన్నారు. రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యే సమయంలో విజయేంద్ర వర్మ షూటింగులో బాలయ్య గాయపడ్డారు. ఆ తర్వాత షూటింగ్ కు గ్యాప్ రావడం. ఇంతలోనే విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోవడం సినిమా మధ్యలో ఆగిపోవడం జరిగింది.

also read:

Visitors Are Also Reading