Home » NTR తల్లికి, నాగశౌర్యకు కాబోయే భార్యకు ఉన్న రిలేషన్.. ఏంటో తెలుసా..?

NTR తల్లికి, నాగశౌర్యకు కాబోయే భార్యకు ఉన్న రిలేషన్.. ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో నాగ శౌర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. తనకు కాబోయే భార్య కర్ణాటకకు చెందిన అనూష శెట్టిగా ఇప్పటికే ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ముద్దుగుమ్మ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసేది. అయితే ఈ నెల 20వ తేదీన పెద్దల సమక్షంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ అమ్మాయికి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లికి దగ్గర సంబంధం ఉందట. ఎన్టీఆర్ తల్లి శాలిని కూడా కర్ణాటకకు చెందిన మహిళ. మంగళూరు సమీపంలోని కుందాపూర్ ఆమె స్వస్థలం.

Advertisement

also read:త‌ల్లిదండ్రులు ఈ 4 నియమాలు పాటిస్తే పిల్ల‌లు చెప్పిన‌మాట వింటార‌ట‌..! 3వ‌ది చాలా ఇంపార్టెంట్..!

Advertisement

మన కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా ఇదే ఊరికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం నాగశౌర్య కాబోయే భార్య అనూష శెట్టిది కూడా ఇదే ఊరు. ఈ విధంగా వారందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళవడం విశేషం. అంతేకాకుండా నాగశౌర్యకు ఇష్టమైన హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇక నాగ శౌర్య అంటే ఎన్టీఆర్ సతీమణి ప్రణతికి ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లోని ఒక పాటను రింగ్టోన్ గా కూడా పెట్టుకుందట. మరి నాగశౌర్య చేసుకునే భార్య అనూష ఎవరు అని ఆలోచిస్తున్నారా..

ఆమె బెంగళూరుకు చెందిన ఒక ఇంటీరియర్ డిజైనర్. పలు ప్రముఖ కంపెనీలకు సేవలు అందించిన అనూష బెస్ట్ ఆర్కిటెక్ గా స్టేట్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అనూష శెట్టి డిజైన్స్ పేరుతో కంపెనీ కూడా ప్రారంభించింది. ఇప్పటికే పలు అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆమెకు నాగశౌర్యకు మధ్య పరిచయం ఏర్పడింది,అధికాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో ఒకటయ్యే వరకు వచ్చింది.

also read:

Visitors Are Also Reading