సీనియర్ నటి జయప్రధకు ఊహించని షాక్ తగిలింది. జయప్రధ సినిమాలతో పాటూ రాజీకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జయప్రధ ఎంపీగా కూడా పనిచేశారు. కాగా తాజాగా ఆమెకు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 2019 లోక్ సభ ఎన్నికలలో జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రధ ఉల్లంగించారు అనే ఆరోపణలతో ఆమె పై వేరువేరుగా కేసులు నమోదయ్యాయి.
అయితే విచారణ సమయంలో జయప్రధ కోర్టుకు హాజరవ్వలేదు. దాంతో రాంపూర్ లోని ప్రత్యేక కోర్టు జయప్రధ పై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా జయప్రధకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతే కాకుండా కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో జయప్రధ పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు.
Advertisement
Advertisement
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జయప్రధ ఎన్నికల నియమావళిని ఉల్లంగించినట్టు ఉండటం ఫ్లయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ జయప్రధ పై ఫిర్యాదు చేశారు. దాంతో జయప్రధ పై కేసు నమోదు కాగా ఆ కేసుకు సంబంధించి జయప్రధ కోర్టుకు హాజరవ్వకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థిపై జయప్రధ ఓడిపోయిన సంగతి తెలిసిందే.