Home » నిత్యామీనన్‌ ఇంట విషాదం.. ఒక శకం ముగిసిందంటూ భావోద్వేగపూరిత పోస్ట్‌

నిత్యామీనన్‌ ఇంట విషాదం.. ఒక శకం ముగిసిందంటూ భావోద్వేగపూరిత పోస్ట్‌

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మంచి లవ్ స్టోరీస్ లలో నటించి యూత్ ను బాగా ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Advertisement

తెలుగులో తన చివరి చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమాలో అద్భుతంగా నటించింది. నిత్యామీనన్ కు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యామీనన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోదు. తనకు సంబంధించిన పోస్టులను మాత్రమే సోషల్ మీడియాతో పంచుకుంటుంది. ఇక నిత్యమీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన అమ్మమ్మ అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక నిత్యమీనన్ సోషల్ మీడియాలో రీసెంట్ గా తన అమ్మమ్మ, తాతయ్యకు సంబంధించిన ఒక విషయాన్ని షేర్ చేసుకుంది. ‘ఒక తరం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది.

ఇక నిత్య మీనన్ అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారట. నిత్యమీనన్ కు వారితో చాలా మంచి బాండింగ్ ఉండేదట. నిత్య మీనన్ కుటుంబానికి సంబంధించి ఏదైనా పోస్ట్ పెట్టిందంటే అది కేవలం తన అమ్మమ్మ, తాతయ్య ఫోటోలు మాత్రమే. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇలాంటి సమయంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి నిత్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

Visitors Are Also Reading