Home » ప్రేమించి పెళ్లి చేసుకుందని… ఇంత ఘోరమా…?

ప్రేమించి పెళ్లి చేసుకుందని… ఇంత ఘోరమా…?

by Sravya
Ad

ఈరోజుల్లో చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెద్దల కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోకుండా ప్రేమించిన వాళ్ళతో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మారి సెల్వం, కార్తీక గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు అయితే వీళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే మూడు రోజుల క్రితం ఒక గుడిలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం ప్రాణాలతో లేరు. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడు తూత్తుకూడి జిల్లాలో ప్రాంతానికి చెందిన మారు సెల్వం కార్తీకలు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. మారి సెల్వం తక్కువ కులానికి చెందిన వాడు అవడంతో యువతి కుటుంబ సభ్యులు అతనితో పెళ్ళికి ఒప్పుకోలేదు. తర్వాత యువతి జరిగిందంతా ప్రియుడికి చెప్పింది లాభం లేదని ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.

Advertisement

కార్తీక తల్లిదండ్రులకి తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. ఈ నూతన దంపతులు దారుణ హ$ త్య$ కి గురయ్యారు. ఇది చూసి స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు. పో$స్ట్మాsర్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. యువతి ఒంటిపై 12 క&త్తి*పోట్లు ఉన్నాయి. యువకుడి శరీరం పై 20 క*త్తి*పో*ట్లు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులే ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading