Home » న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ జంట‌ హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ్లారో తెలుసా..?

న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ జంట‌ హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ్లారో తెలుసా..?

by Anji
Ad

చెన్నై స‌మీపంలోని మ‌హాబ‌లిపురం షెర‌టాన్ గ్రాండ్ హోట‌ల్‌లో జూన్ 09న న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ పెళ్లి జ‌రిగిన విష‌యం విధిత‌మే. పెళ్లి త‌రువాత రోజే త‌మ ఇష్ట‌దైవం తిరుమ‌ల‌కు వెళ్లింది ఈ నూత‌న జంట‌. అక్క‌డ శ్రీ‌వారిని ద‌ర్శించుకుని త‌రువాత ఆల‌య ప‌రిస‌రాల‌తో పాటు తిరుమ‌ల మాడ‌వీధుల్లో చెప్పులు వేసుకొని తిర‌గ‌డంతో వీరిపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనికి విఘ్నేష్ శివ‌న్ త‌ప్పుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఓ లేఖ రాశారు. అందులో ఏముందంటే.. తెలియ‌కుండా చేసిన పొర‌పాటు అని.. కావాల‌ని చేసింది కాద‌ని.. స్వామి వారు అంటే త‌మ కుటుంబానికి ఎంతో భ‌క్తి అని విఘ్నేష్ తెలిపారు. దీంతో ఈ స‌మ‌స్య ఇంత‌టితో ఆగిపోయింది.


మ‌రొక వైపు వీరి పెళ్లి అంద‌రికీ గుర్తుండిపోయేవిధంగా సుమారు ల‌క్ష మందికి విందు భోజ‌నాలు పెట్టారు. న‌య‌న‌తార‌-విఘ్నేష్ దంప‌తులు. గ‌త కొద్ది రోజులుగా ఈ సెల‌బ్రిటీ జంటకు సంబంధించి ఏ విష‌య‌మైనా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ నూత‌న దంప‌తులు హ‌నీమూన్ ట్రిప్ వేసింది. హ‌నీమూన్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుని థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ చేరుకున్నారు. అక్క‌డ ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కి వెళ్లారు. పెళ్లి త‌రువాత ఫ‌స్ట్ టూర్ కావ‌డంతో ఈ టూర్‌లో ఫుల్ ఎంజాయ్ చేయాల‌ని వారు ఫిక్స్ అయ్యార‌ట‌. హ‌నీమూన్ ట్రిప్‌న‌కు సంబంధించి ఫోటోల‌ను విఘ్నేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు.

Advertisement

Advertisement

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ దంప‌తుల హ‌నీమూన్ ట్రిప్ ఫోటోలు వైరలవుతున్నాయి. ఎంజాయ్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఈ ట్రిప్ కోసం దాదాపు కోట్ల‌లో ఖ‌ర్చు చేస్తుంద‌ట. ఈ జంట విమానంలో ప్ర‌యాణించే స‌మయంలో వారితో ఓ అభిమాని సెల్పీ తీసుకున్నాడ‌ట‌. ఈ ఫోటో కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ కొత్త జంట హ‌నీమూన్ ట్రిప్‌లో బాగా ఎంజాయ్ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : 

ఉదయ్ కిరణ్ నటించిన హిట్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ !

బాలయ్య బాబు ఆ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా ? ఎన్టీఆర్, హరికృష్ణ లు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోలేదు ?

Visitors Are Also Reading