Home » నరేష్, పవిత్రల బంధం అప్పుడే మొదలైందా..?

నరేష్, పవిత్రల బంధం అప్పుడే మొదలైందా..?

by Azhar
Ad

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన నరేష్, పవిత్రల బంధం గురించే వార్తలు అనేవి వస్తున్నాయి. అంతలా వీరు ఇప్పుడు తెగ ట్రెండ్ అనేది అవుతున్నారు. అయితే నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగాయి. అలాగే పవిత్రకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. అయితే నరేష్ తన మూడో భార్య అయిన రమ్య నుండి ఇంకా విడాకులు అనేవి తీసుకోలేదు. వీరి కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. అక్కడ ఆ కేసు అలా ఉండగానే నరేష్ పవిత్రతో ప్రేమాయణం అనేది నడిపిస్తున్నాడు. ఇప్పడు ఎక్కడ చూసిన ఇవే వార్తలు. కానీ వీరి ప్రేమ అనేది ఎప్పుడు మొదలయింది అనేది చాలా మందికి తెలియదు.

Advertisement

నరేష్, పవిత్రలకు మొదటి సారి సమ్మోహనం అనే సినిమా షూటింగ్ లో పరిచయం ఏర్పడిందట. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు తలిదండ్రుల పాత్రలో నరేష్, పవిత్ర కనిపించారు. అయితే ఈ సినిమా అనేది పూర్తయేలోపు నరేష్ కు బాగా దగ్గరైన.. వాళ్ల ఇంట్లోని కొన్ని కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక అప్పటినుండి వీరి ప్రేమ అనేది మొదలయింది అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో కూడా నరేష్ పవిత్రను ఆకాశానికి ఎత్హేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

అయితే ఈ సినిమా తర్వాత కూడా నరేష్, పవిత్ర ఇంకా మరి కొన్ని సినిమాలో నటించారు. అప్పటినుండే వీరి మధ్యలో ప్రేమ అనేది నడుస్తుంది అని నరేష్ మూడో భార్య రమ్య ఆరోపిస్తుంది. అలాగే ఈ మధ్యే వీరు హోటల్ లో ఒక్కే రూమ్ లో ఉన్న విషయాన్ని కూడా మీడియాకు తెలిపి.. వీరి బంధాన్ని బయట పెట్టింది. అయితే పవిత్ర కూడా తన రెండో భర్తకు విడాకులు అనేది ఇవ్వలేదు. కానీ వీరు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంలో నరేష్ భార్య రమ్య చేసిన విధంగా పవిత్ర భర్త మాత్రం చేయడం లేదు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి మద్దతుగా నిలిచిన గంగూలీ..!

బీసీసీఐపై మరోసారి విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం..!

Visitors Are Also Reading