Home » సమంత-చైతన్య విడాకులపై మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్.. మరీ ఇంతలా..!!

సమంత-చైతన్య విడాకులపై మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్.. మరీ ఇంతలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీ లో వివాహం చేసుకోవడం మరియు విడాకులు తీసుకోవడం అనేది కామన్ పాయింట్. నటీనటులకు సంబంధించి ఇలాంటి విషయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ఇప్పటికి ప్రతి ఒక్కరి నోట్లో నానుతూనే ఉంది. లవ్ చేసుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చూడ చక్కనైన జంటగా అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు. అలాంటి జంట గతేడాది అనుకోకుండా విడాకులు ప్రకటించారు. వీరు ఈ విషయాన్ని ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా కానీ వారు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అప్పటినుంచి ఈ విషయం సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది.

Advertisement

తాజాగా నిర్మాత మురళీమోహన్ వీరికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని బయట పెట్టారు. చైతన్యకు నా అపార్ట్మెంట్ బాగా నచ్చడంతో ఆయన కావాలని అడిగారు. దీంతో మురళీమోహన్ అది నా ఫ్యామిలీ కోసం నేను నిర్మించుకున్నానని చెప్పి ఇవ్వలేను అన్నారు. దీంతో ఈ విషయాన్ని చైతన్య వెళ్లి నాగార్జునకు చెప్పడంతో స్వయంగా నాగార్జున మురళీమోహన్ కు కాల్ చేసి అది చైతన్యకు బాగా నచ్చిందట ఆయనకి ఇవ్వండి అని అడిగారు. ఆ సమయంలో నాగార్జునకు మరియు మురళీమోహన్ కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఆయన మాట కాదనలేక అపార్ట్మెంట్ నాగచైతన్యకు ఇచ్చారు మురళీమోహన్. దీంతో నాగచైతన్య మరియు సమంత అపార్ట్మెంట్లోనే ఉండేవారు.

Advertisement

ప్పుడు చూసినా వీరు చూడముచ్చటగా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ కలిసి తరచూ పార్టీలు చేసుకోవడం, ఇంటి దగ్గర సంతోషంగా ఉండటం మాత్రమే నాకు తెలుసని, వారి మధ్య ఎప్పుడూ గొడవ జరిగిన విషయం తనకు తెలియదని మురళీమోహన్ అన్నారు.ఒక రోజు మా పని మనిషి వచ్చి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని చెప్పింది . వారిద్దరూ కలిసి ఉండటం లేదని ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని విషయం పని మనిషి ద్వారా తెలిసిందని మురళీమోహన్ అన్నారు..ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే విషయం తప్ప, దానికి కారణం ఏంటనేది నాకు తెలియదని మురళీమోహన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ:

Visitors Are Also Reading