కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో త్వరలో చేరబోతున్నారా..? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించానున్నారా ..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న వార్త ఇది. కిర్లంపూడి లో ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభంతో సమావేశం అయ్యారు. గత వారం పవన్ కళ్యాణ్ రాసిన లేఖలు గురించి ప్రస్తావించారు. కాపులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని పద్మనాభం తన అభిప్రాయాన్ని చెప్పారట.
Advertisement
Advertisement
పవన్ కళ్యాణ్ వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తానని ముద్రగడ అన్నారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే టిడిపి కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం అయ్యారు. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .ముద్రగడని కలిసిన జ్యోతుల నెహ్రూ టిడిపి జనసేన కుటమితో కలిసి పనిచేయాలని కోరుతున్నారట. ఇప్పటివరకు ముద్రగడ పద్మనాభం వైసిపి లో చేరుతారని చర్చ జరుగుతూ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి అనుకూల వాతావరణం లేదు అని ముద్రగడ అభిప్రాయపడుతున్నారట. అయితే రెండు మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ముద్రగడని కలుస్తారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
పొలిటికల్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!