Home » నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

by Bunty
Ad

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై టీం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో రెండు ఆసక్తికర విషయాలు జరిగాయి. ఈ రెండు విషయాల్లో హీరో ధోని అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో ధోని తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అద్భుతమైన స్టంపింగ్ తో పాటుగా అంతే అద్భుతమైన కీపింగ్ స్కిల్స్ ను మరోసారి ప్రపంచానికి చూపించాడు.

READ ALSO :  చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

జడేజా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ ను స్టంన్నింగ్ స్టంపౌట్ చేశాడు. ఇక ఇదే మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను అద్భుతమైన త్రోతో పెవిలియన్ కు పంపాడు ధోని. కాగా, మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ధోని మాట్లాడుతూ… “నేను నా కెరీర్ లో చివరి దశలో ఉన్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి మ్యాచ్ ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

Advertisement

READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Bollywood is not my cup of tea, says MS Dhoni - India Today

ఇక ఈ ఏడాది సీజన్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. కానీ మ్యాచ్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ప్రతిరన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉంది. అతడిని బ్యాటర్లు ఎదుర్కోవడం అంత సులభం కాదు. పతిరన అచ్చం మలింగా బౌలింగ్ యాక్షన్ ను పోలి ఉన్నాడు” అని పేర్కొన్నాడు ధోని.

READ ALSO :  Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Visitors Are Also Reading