మహేశ్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు సినిమా ఒకటి. ఈ చిత్రం మహేశ్ బాబు కెరీర్ కు మైలురాయి అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా మహేశ్ బాబులోని లవర్ బాయ్ తో పాటూ మాస్ యాటిట్యూడ్ ను జనాలకు పరిచయం చేసింది. సినిమాలో మహేశ్ బాబు యాక్షన్ హీరోయిజం ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించాయి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటూ మహేశ్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది.
Advertisement
ఈ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహించగా భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రకాష్ విలనిజంతో ఆకట్టుకున్నారు. మహేశ్ బాబు ప్రకాష్ రాజ్ మధ్యలో ఉండే డైలాగులు యాక్షన్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. సినిమాలో మహేశ్ బాబు కబడ్డి ప్లేయర్ గా నటించగా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మహేశ్ బాబు కోర్టులో కబడ్డీ ఆడటం చిత్రానికి మరో హైలెట్.
Advertisement
ఇక ఈ చిత్రానికి ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎమ్ ఎస్ రాజు ఒక్కడు క్లైమాక్స్ సీన్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారట. ఆ విషయాన్ని తాజాగా ఎమ్ ఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్ వెల్ ముందు పాటలో మహేశ్ బాబు ప్రకాష్ రాజ్ ను కొట్టి భూమికను తీసుకెళతారని…అయితే దానికి గుణశేఖర్ పాట వేశారని అన్నారు.
ALSO READ : ASHU REDDY : అందం చూడమంటే కారు చలాన్లు చూశారు..అడ్డంగా బుక్కైన అష్షు రెడ్డి..!
దానికి తాను చాలా థ్రిల్ అయ్యా అని చెప్పారు. కానీ మహేశ్ బాబు స్టార్ హీరో కృష్ణ గారి కుమారుడు అని మరి జనాలు ఈ సీన్ ను ఒప్పుకుంటారా అనే అనుమానం మొదలైందని అన్నారు. ఆ సీన్ తనకు రాత్రి కలలోకి కూడా వచ్చిందని చెప్పారు. అయితే తాను తన స్నేహితుడికి విషయాన్ని చెప్పగా ఆయన కూడా చాలా బాగుందని అన్నారు. కానీ సినిమా చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచిందన్నారు.