Home » విక్ర‌మ్ సినిమాలో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..?

విక్ర‌మ్ సినిమాలో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కులు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సాధిస్తున్నారు. సినిమా బాగుంటే చాలు భాష‌తో సంబంధం లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులు చూసేస్తున్నారు. దాంతో డైరెక్ట‌ర్ లు సైతం పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం టాప్ డైరెక్ట‌ర్ ల లిస్ట్ లో లోకేష్ క‌న‌క‌రాజ్ కూడా చేరిపోయాడు. లోకేష్ క‌న‌క‌రాజ్ ఖైధీ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. ఈ సినిమాలో కార్తీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించగా పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమా విడుద‌లైంది.

Advertisement

ఈ సినిమా త‌ర‌వాత లోకేష్ క‌న‌రాజ్ త‌మిళ స్టార్ విజ‌య్ తో క‌లిసి మాస్ట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్ గా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాసన్ హీరోగా న‌టించిన విక్ర‌మ్ సినిమా విడుద‌లైంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో లోకేష్ క‌న‌క‌రాజ్ మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే ఖైధీ సినిమాకు విక్ర‌మ్ సినిమాకు లింక్ ఉందని చెబుతున్నారు. అయితే ఖైధీ సినిమాలో అన్బు పాత్ర చనిపోతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు ఆ పాత్ర చ‌నిపోయిన త‌ర‌వాత ఎలా బ్ర‌తికి వ‌చ్చింది అని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌రాజ్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో జ‌రిపిన చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చాడు. ఖైధీ సినిమాలో చ‌నిపోయిన అర్జున్ దాస్ పాత్ర మ‌ళ్లీ ఎలా బ్ర‌తికి వ‌చ్చింది అని ఓ నెటిజ‌న్ లోకేష్ క‌న‌క‌రాజ్ ను ప్ర‌శ్నించాడు.

దానికి లోకేష్ ఆన్స‌ర్ ఇస్తూ…నెపోలియ‌న్ వ‌ల్ల అన్బు గ‌డ్డం మాత్రమే ప‌గిలిందని, అందువ‌ల్లే విక్ర‌మ్ సినిమాలో అన్బు పాత్రకు స్టిచ్ మార్క్ క‌నిపిస్తుంద‌ని చెప్పాడు. అంతే కాకుండా దీని గురించి తెలియాలంటే మీరు ఖైధీ 2 సినిమా చూడాల్సిందేనని అన్స‌ర్ ఇచ్చాడు. ఇక అస‌లేం జ‌రిగిందో తెలియాలి అంటే ఖైధీ 2 సినిమా వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

ALSO READ : నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎన్నేళ్ళు చిన్నవాడో తెలుసా..?

Visitors Are Also Reading