ప్రస్తుతం టాలెంట్ ఉన్న దర్శకులు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తున్నారు. సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు చూసేస్తున్నారు. దాంతో డైరెక్టర్ లు సైతం పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో లోకేష్ కనకరాజ్ కూడా చేరిపోయాడు. లోకేష్ కనకరాజ్ ఖైధీ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. ఈ సినిమాలో కార్తీ ప్రధాన పాత్రలో నటించగా పాన్ ఇండియా లెవల్ లో సినిమా విడుదలైంది.
Advertisement
ఈ సినిమా తరవాత లోకేష్ కనరాజ్ తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
Advertisement
ఇదిలా ఉంటే ఖైధీ సినిమాకు విక్రమ్ సినిమాకు లింక్ ఉందని చెబుతున్నారు. అయితే ఖైధీ సినిమాలో అన్బు పాత్ర చనిపోతుందన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆ పాత్ర చనిపోయిన తరవాత ఎలా బ్రతికి వచ్చింది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనరాజ్ సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చాడు. ఖైధీ సినిమాలో చనిపోయిన అర్జున్ దాస్ పాత్ర మళ్లీ ఎలా బ్రతికి వచ్చింది అని ఓ నెటిజన్ లోకేష్ కనకరాజ్ ను ప్రశ్నించాడు.
దానికి లోకేష్ ఆన్సర్ ఇస్తూ…నెపోలియన్ వల్ల అన్బు గడ్డం మాత్రమే పగిలిందని, అందువల్లే విక్రమ్ సినిమాలో అన్బు పాత్రకు స్టిచ్ మార్క్ కనిపిస్తుందని చెప్పాడు. అంతే కాకుండా దీని గురించి తెలియాలంటే మీరు ఖైధీ 2 సినిమా చూడాల్సిందేనని అన్సర్ ఇచ్చాడు. ఇక అసలేం జరిగిందో తెలియాలి అంటే ఖైధీ 2 సినిమా వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ALSO READ : నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎన్నేళ్ళు చిన్నవాడో తెలుసా..?