Home » జగన్ కు భయపడి…ఢిల్లీలో లోకేష్‌ దాక్కున్నాడు – రోజా ఫైర్‌

జగన్ కు భయపడి…ఢిల్లీలో లోకేష్‌ దాక్కున్నాడు – రోజా ఫైర్‌

by Bunty
Ad

ఏపీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాడికి ఎక్కడున్నా వెళ్ళి నోటీసులు ఇవ్వడం తప్పులేదు…అసలు స్కామ్ లేదన్న లోకేష్ ఎందుకు బెయిల్ కోసం కోర్టు వెళ్ళాడని ఫైర్‌ అయ్యారు.చంద్రబాబు, లోకేష్ ఈ స్కామ్ లు అన్ని చేశారు..సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి.. కాబట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. ఇక ఇప్పుడు లోకేష్‌ వంతు వచ్చిందన్నారు. యువగళంలో ఎందుకు చంద్రబాబు ఓటు వేయాలో చెప్పమనండి…ఎమ్మెల్యేలను తిట్టడం తప్ప యువగళంలో లోకేష్ ఎమీ చేస్తున్నాడని నిలదీశారు రోజా.

minister roja slams lokesh

minister roja slams lokesh

ఉ***చ్చాపోయిస్తా…తాటతీస్తా అంటూ లోకేష్ రౌడియిజం చేయాలని చూస్తున్నాడు..జగన్ కు భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానని ఢిల్లీకి పారిపోయి దాక్కున్నాడని ఆగ్రహించారు.పెద్ద తోపులా యువగళం మళ్ళీ ప్రారంభం అని చెప్పి… భయపడి తుస్ మని ఆపేశాడని లోకేష్‌ పై సెటైర్లు పేల్చారు. భువనేశ్వరి, ఆమె కోడలిని ఎప్పుడూ నేను తిట్టలేదు… వైసిపి నేతలు తిట్టలేదని తెలిపారు. కానీ వైఎస్ భారతీ, విజయమ్మకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు పోస్టులు పెట్టారని మండిపడ్డారు.

Advertisement

Advertisement

roja counter bhuvaneshwari and brahmani

roja counter bhuvaneshwari and brahmani

పదేళ్ళ పాటు నేను మీ పార్టీలో ఉన్నాను.. నేను ఎంటో మీకు తెలుసు..నాపైన ఎమ్మెల్యేగా గెలవలేని వాడితో నన్ను తిట్టించారని ఆగ్రహించారు. ఇలానే మీరు ముందుకు వెళితే మేము ఎంటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. సిఎం జగన్ మళ్ళీ మళ్ళీ సిఎం అవ్వాలని కోరారు. మాటల చెప్పే ప్రభుత్వం చంద్రబాబుది…. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం జగన్నన ప్రభుత్వం అని కొనియాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా వాహనమిత్ర అందిస్తున్నామని వెల్లడించారు ఏపీ మంత్రి రోజా.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading