Home » ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ పోస్ట్ వైర‌ల్‌..!

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ పోస్ట్ వైర‌ల్‌..!

by Anji
Ad

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా సినీ సెలెబ్రిటీస్ త‌మ తండ్రుల ఫోటోల‌ను పంచుకుంటూ విషెస్ చెబుతున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ చేశారు. తండ్రి వెంక‌ట్రావ్ ఫోటోను పంచుకుంటూ ఓ గొప్ప త‌న‌యుడిగా గ‌ర్వించే తండ్రిగా అంద‌మైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానని చిరంజీవి త‌న పోస్ట్‌లో రాసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఇక చిరంజీవి సినిమాల విష‌యానికొస్తే.. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి 2వేల‌కు పైగా స్క్రీన్స్‌లో విడుద‌ల అయింది. 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద బ‌రిలోకి దిగింది. ఈ చిత్రం బ‌య్య‌ర్ల‌కు రూ.84 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. దీంతో త‌మ నెక్ట్స్ సినిమాల‌తో వారిని ఆదుకుంటామ‌ని ఈ చిత్ర నిర్మాత‌, క‌మ్ హీరో రామ్ చ‌ర‌ణ్ బ‌య్య‌ర్స్ కు హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాలు ప్ర‌స్తుతం షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. మ‌రొక రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఆయ‌న మ‌రొక ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నిర్మాత‌గా రాణిస్తున్న రాధిక నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో చిరంజీవితో క‌లిసి రాధిక కూడా న‌టించ‌నున్నార‌ట‌. గ‌తంలో చిరంజీవి, రాధిక కాంబోలో వ‌చ్చిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి హిట్‌గానే నిలిచాయి.

Advertisement

తాజాగా ప్రాజెక్ట్ సినిమానా లేక వెబ్ సిరీస్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. చిరంజీవి మ‌రొక రెండు సినిమాల‌ను చేస్తున్నారు. మ‌ళ‌యాళ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాద‌ర్ అనే పేరు ఖ‌రారు చేసారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు సినిమాల‌తో పాటు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ వేదాళం రీమెక్ బోళా శంక‌ర్ అనే సినిమాను కూడా చేస్తున్నారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోలుగా న‌టించిన బ్రోడాడీ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. మ‌ల‌యాళంలో తండ్రి కొడుకులుగా మోహ‌న్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర‌ల‌ను తెలుగులో చిరంజీవి, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిరంజీవి. ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంది.

Visitors Are Also Reading