Home » మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ విడుద‌ల తేదీ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ విడుద‌ల తేదీ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

by Anji
Ad

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ విక్ర‌మ్‌, జ‌యంర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్య‌రాయ్, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ద్రాస్ టాకిస్‌తో క‌లిసి లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత భారీ బ‌డ్జెట్తో నిర్మిస్తున్నీ పీరియాడిక‌ల్ డ్రామాను నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా మొద‌టి భాగం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

Advertisement

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్‌-1ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. దీంతో పాటు ఐశ్వ‌ర్య రాయ్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష మ‌హారాణుల్లాగా క‌నిపించ‌గా.. విక్ర‌మ్, జ‌యం ర‌వి యుద్ధ వీరులుగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కార్తీ మ‌రింత విభిన్న‌మైన లుక్‌లో అల‌రించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా విడుద‌ల కానుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతమందిస్తున్నారు. కెమెరామెన్‌గా ర‌వివ‌ర్మ‌న్‌, ఎడిట‌ర్గా శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే 2018లో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో చెక్కం చివ్వంద వాన‌మ్ విడుద‌ల అయింది. అప్ప‌టి నుంచి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ పైనే పూర్తి దృష్టి సారించారు. మ‌ధ్య‌లో కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తెర‌కెక్కించారు. అయితే పూర్తి స్థాయి సినిమాను మాత్రం రూపొందించ‌లేదు. మ‌ణిర‌త్నం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న పొన్నియిన్ సెల్వ‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Also Read :  ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. యుద్ధం ఎప్పుడో తెలుసా..?

Visitors Are Also Reading