Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. యుద్ధం ఎప్పుడో తెలుసా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. యుద్ధం ఎప్పుడో తెలుసా..?

by Anji
Ad

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసారు. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొన‌సాగుతున్న త‌రుణంలో శాంతి యుద్ధంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం, శాంతి గురించి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వ‌స్తే.. 99 సార్లు శాంతియుతంగానే ప్ర‌య‌త్నిస్తాను. 100వ సారే యుద్ధం చేస్తానంటూ త‌న ఆలోచ‌న విధానాన్ని ట్వీట్ చేశారు.

Advertisement

ఈ కొటేష‌న్ కు క‌లంతో పుస్తకంలో రాసుఉంటున్న త‌న చిత్రాన్ని జోడించారు. ముఖ్యంగా మార్పు కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు చెప్పిన విష‌యం తెలిసిన‌దే. అయితే ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఓ వైపురాష్ట్రంలో అధికార ప‌క్షంపై ప‌వ‌న్ యుద్ధం సాగిస్తుంటే.. మ‌రొక వైపు ప్ర‌పంచాన్ని యుద్ధ మేఘాలు ఆవ‌రించాయి. ఇలాంటి సంద‌ర్భంలో ఈ రెండిటిని మేళ‌విస్తూ ప‌వ‌న్ ఈ ట్వీట్ చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌డంతో ఇప్పుడు ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

Also  Read :  Russia Ukraine War : ఉక్రెయిన్ నాశ‌నానికి ర‌ష్యా బ్ర‌హ్మాస్త్రం అదేనా..?

 

 

Visitors Are Also Reading