Home » మేజర్ టీం చేసిన ఒక్క తప్పు సినిమాకి అక్కడ నష్టాలు ..! అలా ఎందుకు చేయాల్సివచ్చింది ?

మేజర్ టీం చేసిన ఒక్క తప్పు సినిమాకి అక్కడ నష్టాలు ..! అలా ఎందుకు చేయాల్సివచ్చింది ?

by Azhar
Ad

డిఫరెంట్ కథలతో అభిమానుల ముందుకు వచ్చే హీరో అడవి శేష్. తాను చేసే ప్రతి సినిమా అంత ముందు ఉన్న దానికంటే భిన్నంగా ఉండేలా చూసుకునే శేష్ నుండి తాజాగా వచ్చిన సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆ మేజర్ పాత్రలో శేష్ తన 100 శాతం ఇచ్చాడు. అదే విషయాన్ని మేజర్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు కూడా చాలా సార్లు చెప్పాడు.

Advertisement

అయితే సోల్జర్ అనగానే తాను చేసిన త్యాగం గురించి మాత్రమే చెప్పకుండా.. ఆయన జీవితంలో ఆర్మీకీ రాకముందు ఏం జరిగింది.. అందులో ఆయన కుటుంబం ఆయనకు ఎలా తోడుగా నిలిచింది అనే విషయాన్ని కూడా లెక్కకు కట్టినట్టు చూపించారు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అయితే ఈ నెల 2న అభిమానుల ముందుకు వచ్చిన మేజర్ మంచి హిట్ గా నిలిచింది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను కూడా క్రాస్ చేసింది. కానీ ఈ సినిమాకు ఇంకా ఎక్కువ కలెక్షన్ రావాల్సింది. కానీ మేజర్ టీం చేసిన ఒక్క తప్పు సినిమాకి రావాల్సినంత కలెక్షన్స్ రాలేదు అని తెలుస్తుంది.

Advertisement

ఈ మేజర్ సినిమాను మన తెలుగులో మహేష్ బాబు, శేష్ ఇద్దరు బాగానే ప్రమోట్ చేసారు. కానీ బాలీవూడ్ లో మాత్రం ఈ ప్రమోషన్స్ లో అంత సక్సెస్ కాలేకపోయారు. ట్రైలర్ ఒక్కటి సల్మాన్ ఖాన్ తో విడుదల చేయించారు మినహా ఇంకా ఏ విధమైన ప్రమోషన్స్ ను కూడా అక్కడ ఎక్కువగా చేయలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ సినిమా కంటే ముందు మహేష్ సినిమా సర్కారు వారు పాట వచ్చినప్పుడు మహేష్ బాలీవుడ్ పై చేసిన కొంత చర్చకు కారణమయ్యాయి. అందువల్లే మహేష్ ఈ సినిమాకు అంతగా ప్రమోషన్ చేయలేకపోయారు అని తెలుస్తుంది. దాని ప్రభావం ఇప్పుడు కలెక్షన్స్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

మూడో టీ20 లో మూడు మార్పులతో టీం ఇండియా…!

Visitors Are Also Reading