Home » ఆగిపోయిన మహేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా.. ఎందుకో తెలుసా…?

ఆగిపోయిన మహేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా.. ఎందుకో తెలుసా…?

by Azhar
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. వీరిద్దరూ కలిపి తీసిన మొదటి సినిమా అతడు టాలీవుడ్ రికార్డ్స్ ను తిరగరాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో ఖలేజా అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఎదుకు ప్లాప్ అయ్యింది అనే విషయం ఇప్పటికి ఎవరికి తెలియదు. అయితే థియేటర్ లో ప్లాప్ అయిన ఈ సినిమా టీవీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వచ్చిన ప్రతిసారి జనాలు టీవీలకు అతుకపోతారు.

Advertisement

ఇక ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూడో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే మహేశ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా అనేది ఎప్పుడో 10 ఏళ్ళ కిందటనే రావాల్సిందట..! కానీ ఆ సినిమా ఆగిపోయిందట. వీరి కాంబినేషన్ లో ఎప్పుడో మూడో సినిమా అనేది అనౌన్స్ అయ్యింది. దానికి సైన్యం అనే టైటిల్ ను కూడా పెట్టేసారు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ధీ ఆగిపోయింది.

Advertisement

తాజాగా ఈ విషయాన్ని ఎమ్మెస్‌ రాజు కొడుకు సుమంత్‌ అశ్విన్‌ ప్రకటించాడు. ఈ సైన్యం అనే సినిమా మహేశ్‌ – త్రివిక్రమ్‌ ల మూడో సినిమా కావాల్సింది. దీని పైన చాలా చర్చ కూడా జరిగింది. కానీ చివర్లో ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది అని సుమంత్‌ అశ్విన్‌ తెలిపాడు. దాంతో అప్పుడు ఆగిపోయిన ఆ కథతోనే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. కథను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

పెళ్లి అయ్యి నెల కాకముందే.. పెళ్లిపై దీపక్ షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading