Home » ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లో మహేష్ బాబు ఫ్యామిలీ…అక్కడ ఒక్కరోజు అద్దె ఎంతో తెలుసా…!

ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లో మహేష్ బాబు ఫ్యామిలీ…అక్కడ ఒక్కరోజు అద్దె ఎంతో తెలుసా…!

by AJAY
Ad

సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చలిగా కుటుంబంతో గడపడం మహేష్ బాబుకు అలవాటు అంతేకాకుండా సినిమా పూర్తవగానే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళుతుంటారు. ఇక మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి మరోసారి వెకేషన్ కు వెళ్లారు. మహేష్ బాబు కుటుంబంతో కలిసి ప్యారిస్ కు వెళ్లినట్టు సమాచారం. మహేష్ బాబు గతంలో కూడా ప్యారిస్ వెళ్లి వచ్చారు.

Advertisement

అంతేకాకుండా మహేష్ బాబు పారిస్ కు ఎప్పుడు వెళ్ళినా ఆయన ఒక హోటల్లో దిగుతారు. అది కూడా పారిస్ లోని ఓ లగ్జరీ హోటల్ కావడం విశేషం. ఇక అందులోనే మహేష్ బాబు బస చేస్తారు. ఆ హోటల్ పేరు లీ బ్రిస్టల్ కాగా హోటల్ లో ఒక రోజుకు కట్టాల్సిన అద్దె ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. హోటల్ లో గది కోసం కేవలం బస చేయడానికి ఒక రోజుకు లక్ష యాభై వేలు వసూలు చేస్తారట. మహేష్ బాబు కు ఈ హోటల్ ఫేవరెట్ కావడంతో వెళ్ళిన ప్రతి సారి అదే హోటల్ లో బస చేస్తుంటారు.

ఇక ఇప్పుడు కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి అదే హోటల్ లో ఉన్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో కూడా ఈ హోటల్ లో దిగిందే. గతంలో దిగిన ఫోటో ను తాజాగా దిగిన ఫోటో ను కలిపి తనకు ఇష్టమైన ప్రదేశం అంటూ నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read :

రాకీ భాయ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి మీకు ఇది తెలుసా ? ఎక్కడ పరచియం అయ్యారంటే ?

 

మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే ఈ సమస్యల గురించి తెలుసా ?

Visitors Are Also Reading