Home » రాజ‌మౌళిని టార్గెట్ చేసిన మ‌హేష్ బాబు అభిమానులు.. అందుకోస‌మేనా..?

రాజ‌మౌళిని టార్గెట్ చేసిన మ‌హేష్ బాబు అభిమానులు.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా తీయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే రాజ‌మౌళి ఆ సినిమా ఎలా ఉండ‌నుందో ప్ర‌క‌టించారు. వ‌ర‌ల్డ్ క్లాస్ లెవ‌ల్‌లో ఉంటుంద‌ని చెప్ప‌డంతో మ‌రోసారి భారీ బ‌డ్జెట్ తో సినిమా తీయ‌నున్న‌ట‌ట్టు చెప్ప‌క‌నే చెప్పాడు జ‌క్క‌న్న‌. మ‌హేష్ గ్లామ‌ర్ షో కి త‌గ్గ హీరోయిన్ ఉండాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

rajamou

Advertisement

మ‌హేష్ బాబు టాలీవుడ్ ని వ‌దిలీ ఎప్పుడూ బాలీవుడ్, హాలీవుడ్ జోలికి వెళ్ల‌ను అని ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. కానీ అవ‌స‌రం అయితే తెలుగులోనే బాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తాన‌ని చెప్పాడు. అనుకున్న‌ట్టే రాజ‌మౌళితో జ‌త‌క‌డుతున్నాడు ప్రిన్స్‌. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ తో పాటు ప్ర‌పంచంలో చాలా ప్ర‌దేశాల్లో షూటింగ్ జ‌రుప‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ఎస్ఎస్ఎంబీ 28 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

Advertisement

Rajamouli-Mahesh

Rajamouli-Mahesh

ఈ చిత్రాన్ని 6 నెలల్లో పూర్తి చేసి జ‌న‌వ‌రి వ‌ర‌కు రాజ‌మౌళితో సినిమా చేసేందుకు ప్రిపేర్‌గా ఉండ‌నున్నాడు. అందుకు అనుగుణంగా మ‌హేష్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడ‌ట‌. ఇదిలా ఉండ‌గా.. సోష‌ల్ మీడియాలో ప్రిన్స్ జ‌క్క‌న్న సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. మ‌హేష్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌డుకునేను ఫిక్స్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. పొడుగు కాళ్ల సుంద‌రి ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని అగ్ర నిర్మాత అశ్వ‌నిద‌త్ నిర్మిస్తున్నాడు. మ‌హేష్ బాబు స‌ర‌స‌న దీపిక అని టాక్ రావ‌డంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నార‌ట‌. దీపికా చూడ‌డానికి బాగున్న‌ప్ప‌టికీ ప‌క్క‌న బాగోద‌ని మ‌హేష్ అందానికి త‌గ్గ హీరోయిన్ ను ఎంపిక చేయాల‌ని సూప‌ర్ స్టార్ అభిమానులు కోరుతున్నార‌ట‌. అంతేకాదు.. జ‌క్క‌న్న‌పై ఫైర్ అవుతున్నారు.

Also Read :  చిరంజీవికి జరిగిన ఆ అవమానమే..మెగాస్టార్ ను చేసింది..అసలు నిజం బయటపెట్టిన నాగబాబు..!

Visitors Are Also Reading