Home » సెలబ్రిటీగా మారిపోయిన కుమారి ఆంటీ.. అందులో ఆఫర్ వచ్చిందా..?

సెలబ్రిటీగా మారిపోయిన కుమారి ఆంటీ.. అందులో ఆఫర్ వచ్చిందా..?

by Anji

ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి అందరి నోట మారుమ్రోగుతున్న పేరు కుమారి ఆంటీ. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జీవనోపాధి కోసం ఈమె రోడ్డు పక్కన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయిస్తూ ఉండేవారు. అయితే ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వారు మీడియా వారు వెళ్లి ఈమెను ఇంటర్వ్యూలు చేయడంతో ఈమె పాపులర్ అయిపోయింది.

ఎంత పాపులారిటీ అంటే.. ఏకంగా సినిమా సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చేంతగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడమే కాకుండా మరి కొంత మంది తన వద్ద కర్రీస్ తీసుకువెళ్తారు అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ పాపులారిటీతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చేవారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ పై చర్యలు తీసుకున్నారు. ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వార్తల్లో నిలిచారు. కానీ తెలంగాణ చొరువతో తిరిగి తన బిజినెస్ ప్రారంభించారు.

ఫుడ్ స్టాల్ నడుపుతూ ఇలా పాపులర్ అయిన కుమారి ఆంటీకి బుల్లితెరపై అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈమెకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం వచ్చింది కదా..? అసలు ఎప్పుడు వచ్చింది.. మీరు ఎప్పుడూ కనిపించబోతున్నారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఆమె నవ్వుతూ దయచేసి ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగకండి అంటూ సమాధానం చెప్పింది. దీంతో ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కుమారీ ఆంటీ మాత్రం సెలబ్రిటీగా మారిపోయారనే చెప్పవచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading