Home » వరుస పరాజయాలతో కోహ్లీ పరేషాన్.. టెన్షన్ తగ్గించిన కూతురు..!

వరుస పరాజయాలతో కోహ్లీ పరేషాన్.. టెన్షన్ తగ్గించిన కూతురు..!

by Anji
Ad

ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఫస్ట్ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ రెండు వరుస మ్యాచ్ లలో ఓటమి చెందింది. లక్నో సూపర్ జెయింట్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ చివరికి బంతికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Also Read :  IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!

Advertisement

విరాట్ కోహ్లీ కూతురు వామికతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సరదాగా గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారత మాజీ కెప్టెన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ తో ఈ ఫోటోను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరి 2021లో తల్లిదండ్రులయ్యారు. ఈ దంపతులు ఇద్దరూ తన కుమార్తె ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడానికి ఇష్టపడడం లేదు. అయినప్పటికీ వామిక ఫొటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  

Advertisement

Also Read :  IPL 2023 : ధోని రివ్యూ సిస్టమ్…షాక్ లో అంపైర్

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలో విరాట్ కోహ్లీకి కూతురు వామికతో సరదాగా కనిపించాడు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, విమికా ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నప్పటికీ జట్టు మాత్రం విజయం సాధించడం లేదు. మూడు మ్యాచ్ లలో కూడా 50 పరుగుల మార్క్ ను రెండుసార్లు దాటేశాడు. లక్నో సూపర్ జెయింట్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  ఈ మ్యాచ్ లో బెంగళూరు 20 ఓవర్లలో 212 పరుగులు చేసినప్పటికీ లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. 19 బంతుల్లో 65 పరుగులు చేసిన నికోలస్ పూరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు. 

Also Read :  ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ప్లేయర్లు వీరే..!

Visitors Are Also Reading