సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ రానించలేకపోవచ్చు. హీరోలు హీరోయిన్ లు ఎవరైనా సరే అందం అభినయంతో పాటూ అదృష్టం కూడా ఉంటేనే పది కాలాల పాటు రానిస్తారు. లేదంటే మధ్యలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్ లో బిజీగా అయిపోతారు. ఇక అలా ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కార్తీక.
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో కార్తీక టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించకపోవడంతో కార్తీకకు కూడా పెద్దగా ఆఫర్ లు రాలేదు. తమిళ్ లో రంగం సినిమాతో కార్తీకకు బ్రేక్ వచ్చింది. ఆ తరవాత చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం కార్తీక అందుకోలేకపోయింది.
also read :50 ఇయర్స్ ఇండస్ట్రీ…..నటులు!!
ఆ తరవాత సోషల్ మీడియాల యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సంపాదించుకునే ప్రయత్నం చేసింది కానీ అక్కడ కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక సరిగ్గా ఆఫర్ లు రాకపోవడంతో 2015 సంవత్సరంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
అయితే సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ సంపాదించడం మాత్రం ఆపలేదు. ఉదయ్ సముద్ర గ్రూప్ అనే సంస్థలో కార్తీక ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. దుబాయ్ లో ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ గా విశేషమైన కృషి చేసినందుకు దుబాయ్ ప్రభుత్వం కార్తీకను గోల్డెన్ వీసాతో తస్కరించింది.
ALSO READ : ఈ ఏడాది రేవంత్ రెడ్డికి కలిసొస్తుందా..? పంచాంగ కర్త ఏం చెప్పారో తెలుసా ?