Home » కొత్త మూవీ గురించి కళ్యాణ్ రామ్ అనౌన్స్.. మరోమారు యాక్షన్ తో..!

కొత్త మూవీ గురించి కళ్యాణ్ రామ్ అనౌన్స్.. మరోమారు యాక్షన్ తో..!

by Anji
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత వచ్చిన అమిగోస్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పూర్తి ఫోకస్ పెట్టారు కళ్యాణ్  రామ్.  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డేవిల్ మూవీలో నటిస్తున్నారు. 

Advertisement

ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో మరోసారి కళ్యాణ్ రామ్ తో జతకడుతుంది ఈ బ్యూటీ. ఇవాళ కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా డేవిల్ మూవీ నుంచి టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో మరో కొత్త ప్రాజెక్ట్ నుంచి అప్డేట్  వచ్చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని అశోక్ వర్థన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా అశోక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్నారు. 

Advertisement

కళ్యాణ్ రామ్ #NKR21 అనౌన్స్ మెంట్ - Mana Telangana

గతంలో రాజా చేయి వేస్తే మూవీకి డైరెక్టర్ చేశాడు ప్రదీప్. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అదేవిధంగా ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. మరో కొత్త మూవీ రాబోతుండటం.. ఇందులో యాక్షన్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడమే కాదు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటిని క్రియేట్ చేస్తోంది. సాధారణ జీవితం గడపడానికి అందరి సపోర్ట్ కావాలంటూ.. ఆమె ఈ నోట్ లో తెలిపింది. 

Visitors Are Also Reading