Home » నిర్మాతగా మారి కైకాల సత్యనారాయణ గారు చిరంజీవి సినిమాలని నిర్మించారని కూడా తెలుసా ? ఏ సినిమా అంటే ?

నిర్మాతగా మారి కైకాల సత్యనారాయణ గారు చిరంజీవి సినిమాలని నిర్మించారని కూడా తెలుసా ? ఏ సినిమా అంటే ?

by Bunty
Published: Last Updated on

కైకాల సత్యనారాయణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కైకాల సత్యనారాయణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగాను ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ‘ఇద్దరు దొంగలు’ అనే సినిమాను తన తమ్ముడు కె. నాగేశ్వరరావు తో కలిసి నిర్మించాడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబులు ప్రధాన పాత్రలో నటించారు.

 

‘దో అంఖే బారాహత్’ అనే హిందీ సినిమా నుండి ప్రేరణ పొంది పి.సత్యానంద్ ఈ సినిమా కథను రాశాడు. 1984 జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక మొదటి సినిమాతోనే కైకాల నిర్మాతగా సక్సెస్ సాధించాడు. అలాగే, కైకాల సత్యనారాయణ చిరంజీవితో చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆ చనువుతోనే చిరంజీవి హీరోగా ‘కొదమ సింహం’ అనే కౌబాయ్ సినిమాను నిర్మించారు.

మురళీ మోహన్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిందీలో ప్రాణ్ పోషించిన అనేక పాత్రల్లో తెలుగులో సత్యనారాయణ నటించారు. నిప్పులాంటిమనిషి, యుగంధర్, నా పేరే భగవాన్ వంటి సినిమాలలో ప్రాణ్ పోషించిన పాత్రలను తెలుగులో నటించి సత్యనారాయణ మెప్పించారు. అందువల్ల ప్రాణ్ అంటే సత్యనారాయణకు వల్లమాలిన అభిమానం. పలు సందర్భాల్లో ప్రాణ్ ను సత్యనారాయణ సన్మానించారు. ఇక బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ముద్దుల మొగుడు” అనే చిత్రం నిర్మించారు. అంతేకాదు చిరంజీవితో “కొదమ సింహం” కంటే ముందు చిరంజీవి పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి  : కొత్త సంవత్సరంలో కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. ఆ తప్పులు అంటూ !

Visitors Are Also Reading