Home » 22ఏళ్ల యువ‌కుడితో వివాహిత ఫేస్ బుక్ ల‌వ్..భ‌ర్త‌ను వ‌దిలించుకోవ‌డానికి భారీ స్కెచ్ వేసి చివ‌రికి ఇలా..!

22ఏళ్ల యువ‌కుడితో వివాహిత ఫేస్ బుక్ ల‌వ్..భ‌ర్త‌ను వ‌దిలించుకోవ‌డానికి భారీ స్కెచ్ వేసి చివ‌రికి ఇలా..!

by AJAY
Ad

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది పెళ్లికి ముందు ప్రేమించిన వారితోనే సంబంధాలను కొనసాగిస్తుంటే.. మరికొందరు పెళ్లయిన తర్వాత కూడా ఇతరుల మోజులో పడి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడి మోజులో భర్తలను హత మారుస్తున్న వాళ్ళు… ప్రియురాలు మోజులో భార్యలను హతమారుస్తున్న వాళ్లు సైతం చాలామంది కనిపిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

వివరాల్లోకి వెళితే…. పెద్దముడియం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీ కృష్ణారెడ్డి 22 ఏళ్లు అనే యువకుడితో మాబ్బి అనే 33 ఏళ్ల వివాహితకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మాబ్బి భర్త కరిముల్లా ఖాన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే మాబ్బి వంశీకృష్ణ రెడ్డి మధ్య ఏర్పడిన పరిచయం కొంతకాలానికి అక్రమ సంబందానికి దారితీసింది. దాంతో వీరిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు.

Advertisement

అయితే అప్పటికే ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మాబ్బి భర్త పిల్లలను పట్టించుకోకుండా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వంశీకృష్ణ రెడ్డితో కలిసి హబ్బీ భర్తను హతమార్చేందుకు భారీ స్కెచ్ వేసింది. భ‌ర్త మ‌ద్యం మత్తులో ఉన్న స‌మ‌యంలో ప్రియుడిని ఇంటికి పిలుపించుకుంది ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి నిద్రిస్తున్న క‌రీముల్లాఖాన్ ను వైర్ మెడ‌కు బిగించి హ‌త‌మార్చారు.

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా గ్రామానికి దూరంగా చెట్ల పొదల్లో బాడీని పడేశారు. అనంతరం మ‌బ్బి తన భర్తను ఎవరో హతమార్చారంటూ డ్రామా మొదలుపెట్టింది. కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ పోలీసులకు అనుమానం రావ‌డంతో తమ స్టైల్ లో విచారించేసరికి అసలు నిజాలు బయటకు వచ్చాయి. దాంతో నిందితులిద్ద‌రినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Visitors Are Also Reading